Site icon HashtagU Telugu

Hyderabad Metro: హైద‌రాబాద్ మెట్రో ప్ర‌యాణీకుల‌కు బ్యాడ్ న్యూస్‌.. ఛార్జీలు భారీగా పెంపు!

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro:HYD: ఈ నెల 17 నుంచి మెట్రో రైల్‌ ఛార్జీలు పెరగనున్నాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి పెంచుతున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ ప్రకటించింది. మొదటి 2 స్టాపుల వరకు రూ.12; 2 నుంచి 4 స్టాపుల వరకు రూ.18; 4 నుంచి 6 స్టాపుల వరకు రూ.30; గరిష్ఠంగా రూ.60 నుంచి రూ.75కి పెంచుతున్నట్లు పేర్కొంది.

హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro) సవరించిన చార్జీలు మే 17, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. మెట్రో రైల్వే (ఆపరేషన్ & మెయింటెనెన్స్) చట్టం 2002లోని సెక్షన్ 34 ప్రకారం.. భారత ప్రభుత్వ లెటర్ నం. K-14011/29/2018-MRTS-II ఆధారంగా హైకోర్టు మాజీ జడ్జి సారథ్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) ఏర్పాటైంది. ఈ కమిటీ 25 జనవరి 2023న సవరించిన చార్జీల స్వరూపాన్ని సిఫార్సు చేస్తూ నివేదిక సమర్పించింది. సెక్షన్ 37 ప్రకారం.. FFC సిఫార్సులకు మెట్రో రైల్వే అడ్మినిస్ట్రేషన్ కట్టుబడి ఉండాలి.

FFC సిఫార్సు చేసిన చార్జీలు సేవల అందుబాటు, ఆర్థిక స్థిరత్వం మధ్య సమతౌల్యతను కాపాడేలా రూపొందించబడ్డాయి. సవరించిన చార్జీలు దూరం ఆధారంగా నిర్ణయించబడ్డాయి. 0-2 కి.మీ ప్రయాణానికి రూ. 12, 2-4 కి.మీకి రూ. 18, 4-6 కి.మీ.కి రూ. 30, 6-9 కి.మీకి రూ. 40, 9-12 కి.మీకి రూ. 50, 12-15 కి.మీకి రూ. 55, 15-18 కి.మీకి రూ. 60, 18-21 కి.మీకి రూ. 66, 21-24 కి.మీకి రూ. 70, 24 కి.మీపైన రూ. 75 వసూలు చేయబడుతుంది.

ఈ సవరణలు హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఆర్థిక స్థిరత్వం కోసం ఈ చార్జీలు నిర్వహణ, ఆధునీకరణ ఖర్చులను భరించడంలో సహాయపడతాయి. అదే సమయంలో సామాన్య ప్రయాణికులపై భారం పడకుండా చార్జీలు సహేతుకంగా ఉండేలా FFC జాగ్రత్త వహించింది.

Also Read: Anasuya Dating : రామ్ చరణ్‌తో డేటింగ్ చేసేదాన్ని – అనసూయ హాట్ ఆన్సర్

సవరించిన చార్జీల వివరాలు

ఈ చార్జీలు 25 జనవరి 2023 నాటి FFC నివేదిక ఆధారంగా రూపొందించబడ్డాయి.