Telangana: ముస్లిం యువతను ఒవైసీ రెచ్చగొడుతున్నాడు: బండి

ఈ నెల 22న జరగనున్న రామ మందిర విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు .

Telangana: ఈ నెల 22న జరగనున్న రామ మందిర విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు .

బుధవారం చైతన్యపురి కాలనీలో ఇంటింటికి రాముడి అక్షింతలు పంపిణీ చేశారు బండి సంజయ్. శ్రీరామ ట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్య నుంచి అక్షింతలు తెప్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ వివాదాస్పద ప్రకటనలు చేస్తూ ముస్లిం యువతను రెచ్చగొట్టేందుకు అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నిస్తున్నారని అన్నారు.

రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశవ్యాప్తంగా ముస్లిం మత పెద్దలు కూడా వ్యతిరేకించలేదని సంజయ్ కుమార్ అన్నారు . రాజకీయాలకు సంబంధం లేకుండా. దేశంలోని హిందువులు తమ వంతు సహకారం అందించి అద్భుతమైన రామమందిరాన్ని నిర్మించారని చెప్పారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు.

Also Read: Virat Kohli : అట్లుంటది కోహ్లీతోని…కేప్ టౌన్ టెస్టులో విరాట్ కెప్టెన్సీ