Owaisi : బోగ‌స్ ఓట్ల ఆరోప‌ణ‌పై స్పందించిన అస‌దుద్దీన్ ఓవైసీ

  • Written By:
  • Publish Date - April 13, 2024 / 03:50 PM IST

Asaduddin Owaisi: హైదరాబాద్(Hyderabad) లోక్ సభ నియోజకవర్గం(Lok Sabha Constituency) పరిధిలో బోగస్ ఓట్లు(Bogus votes) ఉన్నాయన్న బీజేపీ(BJP) అభ్యర్థి కొంపెల్ల మాధవీలత(Madhavilatha) ఆరోపణలపై మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) స్పందించారు. హైదరాబాద్ లోక్ సభ పరిధిలో 6 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలను అసదుద్దీన్ ఖండించారు. ఓట‌రు జాబితా గురించి ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. వీటిలో మన పాత్ర ఏమీ ఉండదన్నారు. ఓట‌రు జాబితాలో కొత్త పేర్ల‌ను జోడించ‌డం, తుది ఓట‌ర్ల జాబితాను ప్ర‌క‌టించ‌డం వంటివి అన్నీ ప్ర‌తి ఏడాది ఎన్నిక‌ల సంఘం చూసుకుంటుందని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

 

Read Also: Famous Beaches : ఆ బీచ్ లకు వెళ్తే..అక్కడ నగ్నంగా తిరగాల్సిందే

ఎన్నికల సంఘానికి తాను హెడ్‌ను ఏమీ కాదని ఎద్దేవా చేశారు. బోగస్ ఓట్లు అంటే ఎన్నికల సంఘాన్ని అవమానించడమే అన్నారు. అలా మాట్లాడటం ద్వారా హైదరాబాద్ ప్రజలను కూడా అవమానిస్తున్నట్లే అన్నారు. ఈ నియోజకవర్గంలో దళిత, వెనుకబడిన, మైనార్టీ ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లు ఉన్నారని, వారి ఓట్లతోనే తాము గెలుస్తున్నట్లు చెప్పారు.