తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది టీఎస్పీఎస్సీ. భారీగా పోస్టులను రిలీజ్ చేస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 22 నుంచి అక్టోబర్ 15 వరకు అన్ లైన్లో దరఖాస్తులను స్వీకరించనన్నారు. పంచాయతీరాజ్ , మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగాలతోపాటు మరికొన్ని విభాగాల్లో ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.