Site icon HashtagU Telugu

Amit Shah: భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు

Amit Shah

Amit Shah

Amit Shah: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ మేరకు రంగారెడ్డిలోని కొంగరకలాన్‌లో 1200 మంది బీజేపీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి సహా బీజేపీ సీనియర్ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి కేసరి పార్టీ మండల, జిల్లా అధ్యక్షులను ఆహ్వానించింది బీజేపీ.

తెలంగాణ నుంచి లోకసభ ఎన్నికల్లో కనీసం 10 సీట్లను సాధించేందుకు అమిత్ షా వ్యూహాత్మక విధానాన్ని రూపొందించనున్నారు.అయితే సన్నాహక సమావేశానికి హాజరయ్యే ముందు అమిత్ షా చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆ పార్టీ కేవలం 4 సీట్లు మాత్రమే గెలుచుకుంది. గతంలో జరిగిన ఉప ఎన్నికలు మరియు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గెలిచి ఒక సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది.తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది.

Also Read: Beauty Tips: ముఖంపై మొటిమలు మచ్చల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఒక్కసారి ఇది అప్లై చేయాల్సిందే?