పాలేరు అసెంబ్లీ టిక్కెట్ ఆశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలోని ఇతర కాంగ్రెస్ నేతల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. సీఎం కే చంద్రశేఖర్ రావు తనను అభ్యర్థుల జాబితా నుంచి తప్పించి, పాలేరు స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన ఉపేందర్రెడ్డి అధికార పార్టీలో చేరారు.
2014 ఎన్నికల్లో ప్రజారాజ్యం టికెట్పై నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి రుచిచూసి కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత రాయల నాగేశ్వరరావు మాజీ మంత్రికి ప్రధాన ప్రత్యర్థి. తుమ్మల కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, తన స్వగ్రామమైన గండుగులపల్లిలో పార్టీ జెండాలను తొలగించారని రాయల ఆరోపించారు. తుమ్మల అభ్యర్థిత్వాన్ని పార్టీ కార్యకర్తలు అంగీకరించే ప్రసక్తే లేదని రాయల వాదిస్తున్నారు. కాగా మరోవైపు పాలేరులో పోటీ చేస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించింది. ఇప్పటికే పాలేరులో గ్రౌండ్ వర్క్ చేసుకున్న షర్మిల ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఇక తుమ్మల నాగేశ్వర రావు పాలేరులో పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈసారి ఎలాగైనా పాలేరు బరిలో ఉండాలని తుమ్మలపై అనుచరుల ఒత్తిడి తెస్తున్నారు. అటు పాలేరుపైనే ఫోకస్ పెట్టారు ఇటీవల కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
మొదట కొత్తగూడెం, ఖమ్మం వైపు ఆసక్తి చూపినా .. చివరికి పాలేరు వైపే చూపుతున్నారు. అయితే అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందన్న ఆసక్తి నెలకొంది. అయితే కమ్మ సామాజికవర్గానికి చెందిన తుమ్మలకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనుచరులున్నారు. అంతేకాకుండా ఉభయ రాష్ట్రాల్లోనూ వివిధ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేవలం ఖమ్మం జిల్లానే కాకుండా తెలంగాణలోని కమ్మ సామాజికవర్గాన్ని తుమ్మల ప్రభావం చేయగలరని అంటున్నారు.
Also Read: Shocking: పెళ్లికి నిరాకరించిన వృద్ధుడు, ఉరేసుకొని 18 ఏళ్ల యువతి ఆత్మహత్య