MLC Kavitha: మేడారం ఉత్సవాలకు కేంద్రం రూపాయి కూడా ఇవ్వలే!

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగ హోదా కల్పించాలని, ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని ఎమ్మెల్సీ కె.కవిత డిమాండ్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Medaram

Medaram

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగ హోదా కల్పించాలని, ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని ఎమ్మెల్సీ కె.కవిత డిమాండ్ చేశారు. మేడారం జాతర పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎమ్మెల్సీ ప్రశ్నించారు. “ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ.. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర జరగడం మాకు గర్వకారణం” అని ఆమె సోమవారం ట్వీట్ చేశారు.

మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖల కాపీలను కూడా ఎమ్మెల్సీ కవిత షేర్ చేశారు. గత నాలుగేళ్ల నుంచి మేడారం ఉత్సవాల నిర్వహణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూ.332.71 కోట్లు కేటాయించారని ఆమె తెలిపారు. మేడారం ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు మంజూరు చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం పదేపదే కోరినప్పటికీ ఉత్సవాలకు జాతీయ పండుగ హోదా కల్పించడంలో విఫలమైందని ఆమె బండి సంజయ్‌ను ప్రశ్నించారు.

  Last Updated: 25 Jan 2022, 01:46 PM IST