Site icon HashtagU Telugu

Nalgonda : డాక్టర్ల నిర్లక్ష్యం.. కుర్చీలోనే ప్రసవించిన మహిళ

Ngd Govt Hsp

Ngd Govt Hsp

ఓ మహిళ గర్బిణి (pregnant woman)తో ఉంటె ఎంత జాగ్రత్త గా ఉండాలో..ఆమెను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలియంది కాదు. ఓ పసిపాపను కడుపులో జాగ్రత్త గా 9 నెలలు మోసి..పునర్జ్ఞ్మ ఎత్తుతుంది మహిళ. అలాంటి నిండు గర్భిణికి చేదు అనుభవం ఎదురైంది. అది కూడా ప్రభుత్వ హాస్పటల్ లో..నల్గొండ లోని ప్రభుత్వ హాస్పటల్ లో వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించింది. ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మాట్లాడుకుంటూ డాక్టర్ సిబ్బంది ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నేరడుగొమ్మ మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని అనే గర్భిణి గురువారం రాత్రి పురిటినొప్పులతో జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ హాస్పటల్ కు వెళ్లగా..అక్కడ డాక్టర్స్ ఎవరు లేరని నల్గొండ ప్రభుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది రిఫ‌ర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్‌లో నల్గొండ జిల్లా ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత ఆసుప‌త్రి సిబ్బంది వారిని ఇక్కడికి ఎందుకు వ‌చ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. దేవరకొండ లో డాక్ట‌ర్లు లేర‌ని, అందుకే ఇక్క‌డికి తీసుకొచ్చామ‌ని కుటుంబ స‌భ్యులు చెప్పారు. అయినప్పటికీ ఆ గర్భిణిని లోనికి తీసుకెళ్లకుండా ఆసుపత్రి ఆవరణ లో ఉన్న కుర్చీపైనే కూర్చుపెట్టారు. నొప్పులు వస్తున్నాయన్న కానీ పట్టించుకోలేదు.

ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో తీవ్ర నొప్పులతో అశ్విని కుర్చీలోనే ప్రసవించింది. దాంతో కుర్చీ కింద తీవ్ర రక్త స్రావమైంది. అప్పుడు న‌ర్సులు హడావుడిగా వచ్చి ఆమెపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఫై వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భర్త ఆంజనేయులు కోరారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణ చందర్ వెంట‌నే ఆసుప‌త్రికి వచ్చారు. అస‌లేం జ‌రిగిందో అక్క‌డి సిబ్బందిని, బాధితుల‌ను అడిగి వివరాలు తీసుకున్నారు. బాధ్యులపై త‌ప్ప‌కుండా చర్యలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

Read Also : Pinnelli: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్