Site icon HashtagU Telugu

Telangana Ministers : తెలంగాణ మంత్రులకు ‘లోక్‌సభ’ పరీక్ష.. ఎందుకంటే ?

Telangana Ministers

Telangana Ministers

Telangana Ministers : ఈ లోక్‌సభ ఎన్నికలు కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే కాదు..  తెలంగాణ మంత్రులకు కూడా ఒక పరీక్షలా మారాయి. ఈసారి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. గెలిచే అవకాశాలను చేజారనివ్వొద్దని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు అందుతున్నాయి. దీంతో మంత్రులు తమకు పార్టీ కేటాయించిన  లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఒకవేళ గెలవాల్సిన చోట ఏదైనా ప్రతికూల ఫలితం వస్తే.. ఎన్నికలయ్యాక దాని ఎఫెక్టు మంత్రుల(Telangana Ministers)  పదవులపై ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఓ మంత్రికి ఈవిషయంపై కాంగ్రెస్ పెద్దలు కీలక సూచనలు చేశారని అంటున్నారు. సదరు మంత్రి తనకు కేటాయించిన లోక్‌సభ స్థానం కాకుండా.. మరో లోక్‌సభ స్థానం వ్యవహారంలో తలదూర్చడంపై కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లాయని చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఎవరా మంత్రి ? 

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ సారి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం ఎన్నికల బాధ్యతలు ఇచ్చారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల నల్లగొండ పార్లమెంట్ పరిధిలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారంటూ మంత్రి ఉత్తమ్‌తో పాటు జానారెడ్డి నుంచి ఏఐసీసీకి ఫిర్యాదులు వెళ్లాయి. నల్లగొండ నుంచి జానారెడ్డి కుమారుడు పోటీ చేస్తున్నారు. అక్కడ కోమటిరెడ్డి జోక్యం అక్కర్లేదని ఏఐసీసీ పెద్దలకు మంత్రి ఉత్తమ్‌, జానారెడ్డి చెప్పారట. దీంతో రంగంలోకి దిగిన ఏఐసీసీ పెద్దలు సికింద్రాబాద్‌పైనే ఫోకస్ చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సూచించారట. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం  ఎదురు చూస్తున్నారు. భువనగిరి ఎంపీని గెలిపించాక తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారట. ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతుందో వేచిచూడాలి.

Also Read :Modi Interview With NTV: ఎన్టీవీ ఇంటర్వ్యూలో మోడీ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ హైకమాండ్ రివ్యూలు, రిపోర్టులు

కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్ధులను గెలిపించే బాధ్యతను మంత్రులకు అప్పగించిన  ఏఐసీసీ.. ప్రచారం ట్రెండ్స్, సమన్వయంతో ముందుకు నడుస్తున్న  తీరుపై ఎప్పటికప్పుడు రిపోర్టులను తెప్పించుకొని సమీక్షిస్తోంది. ఆయా లోక్‌సభ స్థానాలకు పార్టీ  నియమించిన ప్రత్యేక పరిశీలకుల నుంచి కూడా ఏఐసీసీకి రిపోర్టులు వెళ్తున్నాయి.  ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపోటములపై ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రివ్యూ చేస్తోంది. పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారంలో వెనకబడిన అభ్యర్ధుల వేగాన్ని పెంచేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసి ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.

సర్వశక్తులు ఒడ్డుతున్న మంత్రులు

Also Read :Parenting Tips : పిల్లల చేతిలో నుండి మొబైల్ లాక్కోకండి.. ఇలా చేయండి..!