Site icon HashtagU Telugu

Siricilla Railway Bridge : సిరిసిల్ల సమీపంలో రూ.332 కోట్లతో భారీ రైలు వంతెన.. విశేషాలివీ

Siricilla Railway Bridge Karimnagar Hyderabad Krishna River Vijayawada

Siricilla Railway Bridge : ఏకంగా రూ.332 కోట్ల భారీ బడ్జెట్‌తో పొడవైన రైలు వంతెనను సిరిసిల్ల సమీపంలో మానేరునదిపై నిర్మించబోతున్నారు. ఈ వంతెన దాదాపు 2.4 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంటుంది. కృష్ణానదిపై విజయవాడ వద్ద నిర్మించిన రైలు వంతెన చాలా ఫేమస్. అచ్చం దానిలాగే ఇనుప గర్డర్లతో సిరిసిల్ల సమీపంలోనూ రైలు వంతెనను కట్టబోతున్నారట. సాధారణంగా వంతెన మీదుగా రైళ్లు ప్రయాణిస్తే, దానిలో కంపనాలు ఏర్పడతాయి. ఈ కంపనాల ప్రభావం నేరుగా వంతెన పిల్లర్లపై పడుతుంది.  ఈ కంపనాల ప్రభావం పిల్లర్లపై పడకుండా  సిరిసిల్ల రైల్వే వంతెనను ఇనుప గర్డర్లతో బలంగా నిర్మించనున్నారు. ఈమేరకు డిజైన్‌‌తో రైలు వంతెన నిర్మాణ ప్రతిపాదనకు ఆమోద ముద్ర లభించినట్లు తెలిసింది. ఈ వంతెన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. వంతెన పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలిచింది. సిరిసిల్ల వైపు రైల్వే లైన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యేనాటికి వంతెన సిద్ధమయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. 18 నుంచి 20 నెలల్లోగా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్టు తెలిసింది.

Also Read :Telangana MLC Polls : మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కీలక అభ్యర్థులు, ఆశావహులు వీరే

ఎందుకీ వంతెన ?

Also Read :Osmania Hospital: వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ఉస్మా‘‘నయా హాస్పిటల్’’: మంత్రి