CM KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తయిన తరుణంలో రెండో విడత ప్రచారానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈదఫా ఆయన 16 రోజుల్లో 54 నియోజకవర్గాలను చుట్టేయబోతున్నారు. రోజూ వివిధ నియోజకవర్గాల పరిధిలో కనీసం 3 నుంచి 4 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది. పోలింగ్కు మరో 17 రోజుల టైమే ఉన్న తరుణంలో చేయబోతున్న రెండోవిడత ప్రచారాన్ని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఓటర్లను ఎంతలా ఆకర్షిస్తే, అంతలా మళ్లీ విజయం దక్కే అవకాశాలు ఉంటాయి. నవంబర్ 30న పోలింగ్ ఉన్నప్పటికీ.. నవంబర్ 28తోనే ప్రచారం ముగుస్తుంది. అందుకే కేసీఆర్ ఈ 16 రోజుల్లో గ్యాప్ లేకుండా ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నందున బీఆర్ఎస్ పార్టీ సభలకు ప్రజా ఆశీర్వాద సభలుగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈదఫా ఓ వైపు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు పోటీ పెరిగింది. మరోవైపు సీఎం కేసీఆర్ గజ్వేల్తోపాటూ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. ఫలితంగా కేసీఆర్పై ఒత్తిడి పెరిగింది.ఈ ఒత్తిడిని మేనేజ్ చేస్తూనే.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే సంకల్పంతో సుడిగాలి పర్యటనలకు గులాబీ బాస్ సమాయత్తం అవుతున్నారు. ఇవాళ బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
We’re now on WhatsApp. Click to Join.