పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో పెనువిషాదం నెలకొంది. పనులు చేస్తున్న 5గురు కూలీలు ప్రమాదవశాత్తు ఈ ఉదయం మరణించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లపూర్ మండలం రేగుమనగడ్డ దగ్గర ఈ తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది.
రంగారెడ్డి ప్యాకేజీ-1లో పనులు చేస్తుండగా కూలీలు పంప్ హౌజ్ లోకి దిగారు. ఈ సమయంలో క్రేన్ వైర్ తెగిపోయింది. దీంతోకూలీలు కిందపడి మరణించారు. ఈ ఘటనలో మరో కూలీకి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులంతా బీహార్ కు చెందిన వారిగా గుర్తించారు.