Site icon HashtagU Telugu

Telangana Elections : 17 లోక్‌సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు : సీఈఓ వికాస్ రాజ్

Telangana Elections

Telangana Elections

Telangana Elections :  తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై కీలక వివరాలను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ మీడియాకు వెల్లడించారు.  రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో  మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వారిలో 285 మంది స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారని ఆయన తెలిపారు.  అత్యధికంగా సికింద్రాబాద్​ లోక్​సభ నియోజకవర్గంలో 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్​లో 12 మంది పోటీలో ఉన్నారని వివరించారు. మే 13న రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలతో పాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్ కూడా  జరగనుందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్  బరిలో 17 మంది అభ్యర్థులు ఉన్నారని వికాస్ రాజ్ చెప్పారు. ఈ లోక్‌సభ  ఎన్నికల్లో దాదాపు 2.95  లక్షల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటారన్నారు.  60వేల మంది పోలీసులు, 20వేల ఇతర రాష్ట్రాల బలగాలను మోహరిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో వాడే బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ స్టార్ట్ అయిందని ఆయన వెల్లడించారు. సిరిసిల్లలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 16న గులాబీ బాస్ కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.తాజాగా కేసీఆర్ దానిపై వివరణ ఇచ్చారు. ఈ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని  వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల వేళ ఫేక్ వీడియోలతో ప్రచారంపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై విచారణ జరుగుతుందని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు.ఆయన వెల్లడించిన ఇతర వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

తెలంగాణ ఎన్నికల ఏర్పాట్ల వివరాలివీ.. 

Also Read : Sundar Pichai : మన సుందర్ పిచాయ్ ఇక బిలియనీర్.. ఎలా అయ్యారు ?

Also Read : Tragedy in Mumbai: ముంబైలో దారుణం.. టార్చ్ లైట్ వేసి ఆపరేషన్.. తల్లీబిడ్డ మృతి