Site icon HashtagU Telugu

BIG UPDATE : తెలంగాణలో 1.55 లక్షల కొత్త రేషన్ కార్డులు

Telangana Ration Cards Update New Family Members Addition

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) మంజూరు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కార్డులు ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 25వ తేదీ నుండి వారి మొబైల్ నెంబర్లకు సమాచారం మెసేజ్ రూపంలో వస్తుందని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి నిర్వహించబడినట్లు పేర్కొన్నారు.

YS Sharmila : జగన్‌ హయాంలో మద్యం మాఫియాపై రోజూ థ్రిల్లర్‌ సిరీస్‌లో కథనాలు: షర్మిల

ఇతర రేషన్ కార్డుదారుల మాదిరిగా కొత్తగా మంజూరయ్యే రేషన్ కార్డుదారులకు కూడా ప్రభుత్వ నిత్యావసర సరుకుల పంపిణీ కలుగజేయనుంది. ముఖ్యంగా వచ్చే నెల నుంచే వారికి సన్నబియ్యం (ఫైన్ రైస్) పంపిణీ ప్రారంభమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది కొత్తగా కార్డు పొందే పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించి, పోషకాహార భద్రతను అందించేందుకు దోహదపడనుంది. ప్రభుత్వ పథకాల ఫలాలను పేదల వరకూ చేరుస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ఈ కొత్త రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3 కోట్లకు చేరుకుంటుంది. ఇది రాష్ట్రంలో పేదల సంఖ్యకు అద్దం పడుతోంది. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ నిర్ణయం ద్వారా మరోసారి స్పష్టమైంది. రేషన్ కార్డుల ద్వారా పౌష్టికాహార భద్రతతో పాటు ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ చర్య ద్వారా పేద ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకుంటుందని భావిస్తున్నారు.