WhatsApp Alert : సైబర్ కేటుగాళ్లు కొత్తకొత్త మోసాలు చేస్తున్నారు. వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ‘స్క్రీన్ షేర్ ఫీచర్’ను ఆసరాగా చేసుకొని హ్యాకర్లు, సైబర్ దొంగలు హ్యాకింగ్కు తెగబడుతున్నారు. వాట్సాప్ యూజర్స్ ఎవరికి పడితే వారికి.. అపరిచితులకు ‘స్క్రీన్ షేర్ ఫీచర్’ ద్వారా పర్మిషన్ను మంజూరు చేస్తే చాలా రిస్క్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈవిధంగా ఫోన్లోకి చొరబడే ఛాన్స్ను హ్యాకర్లకు ఇస్తే.. మొత్తం బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేసేస్తారని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ మోసాలను ‘వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ స్కామ్’ అని పిలుస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
‘మీ వాట్సాప్లో ఒక సమస్య తలెత్తింది. దీన్ని పరిష్కరించడానికి ఈ లింక్ క్లిక్ చేయండి’.. ‘మీ ఫోన్లో ఒక సమస్య తలెత్తింది. దీన్ని పరిష్కరించడానికి ఈ లింక్ క్లిక్ చేయండి’.. వంటి మెసేజ్లను హ్యాకర్లు వాట్సాప్ యూజర్ల ఫోన్లకు పంపించే అవకాశాలు ఉన్నాయి. ఈ మెసేజ్లలోని లింకులను క్లిక్ చేస్తే.. అవి వాట్సాప్కు రీడైరెక్ట్ అవుతాయి. అనంతరం ‘స్క్రీన్ షేరింగ్ ఎనేబుల్’ అనే పర్మిషన్ను కోరే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ పర్మిషన్కు వాట్సాప్ యూజర్ ఓకే చేస్తే.. వెంటనే హ్యాకర్లకు మన వాట్సాప్పై, మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్పై కంట్రోల్ వచ్చేస్తుంది. అనంతరం హ్యాకర్లు హ్యాక్ చేసిన ఫోనులో ట్రాకింగ్ కోసం మాల్వేర్ను ఇన్స్టాల్ చేసే ముప్పు ఉంటుంది. దీంతోపాటు ఫోన్కు వచ్చే ఓటీపీలు, మెసేజీల ఆధారంగా వాట్సాప్ యూజర్ బ్యాంకు అకౌంట్లు, యూపీఐ ఖాతాల వివరాలను కూడా హ్యాకర్లు దొంగిలిస్తారు. సోషల్ మీడియా అకౌంట్ల లాగిన్ ఐడీలు, పాస్ వర్డ్లను కూడా చోరీ చేస్తారు.