Whatsapp: టెలిగ్రామ్ కి చెక్ పెట్టేందుకు మరో ఎత్తుగడ వేసిన వాట్సాప్.. అదేంటో తెలుసా?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల,

  • Written By:
  • Publish Date - June 9, 2023 / 08:50 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల, రాజకీయ నాయకులు కోటీశ్వరుల వరకు ప్రతి ఒక్కరు ఈ వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. నిత్యం లక్షలాదిమంది వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉన్నారు. కొందరు ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజ్ యాప్ లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఇక రోజు రోజుకి వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా నెలలో కనీసం నాలుగైదు విడుదల చేస్తూ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా వాట్సాప్‌ సంస్థ మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. టెలిగ్రామ్‌కు చెక్‌ పెట్టే దిశగా వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌ ఛానల్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ సహాయంతో వివిధ రకాల కంటెంట్‌కు సంబంధించి సపరేట్ చానల్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే, ఈ చానల్స్ నుండి ప్రాధాన్యతల ఆధారంగా డేటా పొందవచ్చు. అప్‌డేట్స్‌ అనే కొత్త ట్యాబ్‌ను ఇందుకోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో యూజర్లు వివిధ రంగాలకు సంబంధించి షాపింగ్, కొత్త ప్రొడక్ట్స్, స్పోర్ట్స్ ఇలా వివిధ రకాల అప్‌డేట్స్ కోసం చానల్స్‌ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ చానల్స్ ఫాలో అయ్యే యూజర్లు వాటికి సంబంధించిన అప్‌డేట్స్‌ను డైరెక్ట్‌గా ఆ చానల్స్ ద్వారా పొందుతారు.

ఇలాంటి ఫీచర్‌ ఇప్పటికే టెలిగ్రామ్‌ యాప్‌లో అందుబాటులో ఉంది. అయితే దీనికి పోటీగా వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేసుకోవడానికి ఈ కొత్త ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది. వాట్సాప్ సర్వర్‌ లలో చానల్ హిస్టరీని 30 రోజుల వరకు మాత్రమే స్టోర్ అవుతుంది. అడ్మిన్‌లకు పూర్తి కంట్రోలింగ్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొలంబియా, సింగపూర్‌లో అందుబాటులో ఉంటుంది. రాబోయే నెలల్లో ఈ ఫీచర్ మరిన్ని దేశాల్లో అందుబాటులోకి రానుంది.