Whatsapp: కొత్త అప్డేట్.. వాట్సాప్ కంపానియన్ మోడ్.. ఈ ఫీచర్ ల గురించి మీకు తెలుసా?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం కోట్ల మంది వినియోగదారులు ఈ వాట్సాప్ ను

  • Written By:
  • Updated On - November 14, 2022 / 05:09 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం కోట్ల మంది వినియోగదారులు ఈ వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉంటారు. అయితే రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ సంస్థ తమ వినియోగదారుల కోసం మరొక సరి కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది.

అదేమిటంటే ఒకే నంబర్‌తో ఒకేసారి రెండు స్మార్ట్‌ ఫోన్లతోపాటు, మరో రెండు డివైస్‌ లలో వాట్సాప్‌ ను యాక్సెస్‌ కి యూజర్లకు అనుమతినివ్వనుంది వాట్సాప్ సంస్థ. ఈ సేవను ఎనేబుల్ చేసేలా కంపానియన్ మోడ్ అనే ఫీచర్‌ ని పరీక్షిస్తోంది. అలాగే వాట్సాప్ రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే వాబేటా ఇన్ఫో ప్రకారం కంపానియన్ మోడ్‌ ఫీచర్‌ను కొన్ని బీటా టెస్టర్‌లకు విడుదల చేసింది. కొంతమంది బీటా టెస్టర్ల కోసం ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా మొబైల్, డెస్క్‌టాప్‌ లో ఏకకాలంలో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చని తెలిపింది. లింక్ డివైస్ ఆప్షన్ ద్వారా రెండో స్మార్ట్‌ ఫోన్‌ను లింక్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ సంస్థ కల్పించనుంది.

మరొక స్మార్ట్‌ ఫోన్‌ను లింక్ చేసిన తర్వాత, చాట్ హిస్టరీ చూడటం తోపాటు, మెసేజేస్‌ చూసుకోవడం, సమాధానాలి​వ‍్వడంతో పాటు కాల్స్‌ను కూడా చేసుకోవచ్చట. బీటా టెస్టర్ గరిష్టంగా 4 పరికరాలను రెండు స్మార్ట్‌ఫోన్‌లు, ఒక టాబ్లెట్ ,ఒక డెస్క్‌టాప్‌కి లింక్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం క్యూఆర్‌ కోడ్ స్కానింగ్ ద్వారా డెస్క్‌టాప్‌లో వాట్సాప్‌ సేవలను పొందుతున్న సంగతి మనందరికి తెలిసిందే.