WhatsApp: భారతదేశం నుండి వెళ్ళిపోతాం అంటున్న వాట్సాప్.. కారణం ఏంటి?

మెసేజ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉల్లంఘించమని ప్రభుత్వం బలవంతం చేస్తే భారతదేశంలో తమ సేవలను ఉపసంహరించుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్. దేశంలో మెసేజ్ ఎన్‌క్రిప్షన్‌ పై ఈ రోజు ఢిల్లీ కోర్టులో వాదనల అనంతరం వాట్సాప్ ఈ వ్యాఖ్యలకు పాల్పడింది.

WhatsApp: మెసేజ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉల్లంఘించమని ప్రభుత్వం బలవంతం చేస్తే భారతదేశంలో తమ సేవలను ఉపసంహరించుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్. దేశంలో మెసేజ్ ఎన్‌క్రిప్షన్‌ పై ఈ రోజు ఢిల్లీ కోర్టులో వాదనల అనంతరం వాట్సాప్ ఈ వ్యాఖ్యలకు పాల్పడింది.

వాట్సాప్ మరియు దాని మాతృ సంస్థ మెటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021ని సవాలు చేశాయి. భారత ప్రభుత్వ చట్టం ఎన్‌క్రిప్షన్‌ను ఉల్లంఘిస్తోందని మరియు భారత రాజ్యాంగంలోని గోప్యతా రక్షణ చట్టాలను ఉల్లంఘిస్తోందని వాట్సాప్ కోర్టుకు తెలిపింది. వినియోగదారు ఎన్‌క్రిప్షన్‌ను తొలగించడం వల్ల భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19 మరియు 21 ప్రకారం వినియోగదారుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్టేనని పేర్కొంది. అయితే భారత్ లో మెసేజ్ ఎన్‌క్రిప్షన్‌ను తొలగించాల్సిందిగా ప్రభుత్వం తప్పనిసరి చేస్తే భారతదేశం నుండి వెళ్లిపోతుందని వాట్సాప్ తరపున న్యాయవాది తేజస్ కరియా అన్నారు.

We’re now on WhatsApp : Click to Join

వాట్సాప్‌లోని భద్రత మరియు గోప్యతా ఫీచర్ల కారణంగా ప్రజలు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. వాట్సాప్‌కు దేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నందున భారతదేశం అతిపెద్ద మార్కెట్ పెంచుకుంది. మరోవైపు ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది కృతిమాన్ సింగ్ ప్రభుత్వ పాలనను సమర్థించారు. ప్రస్తుత వాతావరణం దృష్ట్యా దేశంలో ఈ చట్టం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ఇరు వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 14కి వాయిదా వేసింది.

Also Read: Rajinikanth : సూపర్ స్టార్ అయిన తరువాత కూడా.. శుభ్రతలేని రైల్వే పట్టాలు దగ్గర భోజనం చేసిన రజినీకాంత్..