చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నో ఇప్పటికే భారత మార్కెట్లోకీ చాలా స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది టెక్నో. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్లోకి తీసుకు రాబోతోంది. టెక్నో పాప్ 9 పేరుతో ఈ ఫోన్ ను లాంచ్ చేయనున్నారు. నవంబర్ 22వ తేదీన ఈ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.
మీడియాటెక్ హీలియో జీ50 ప్రాసెసర్ తో వస్తున్న ఈ తొలి స్మార్ట్ఫోన్ గా టెక్నో పాప్ 9 నిలవనుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వేదికగా ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే..ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ రూ. 10 వేల రేంజ్లో ఉండనుందట. ఈ ఫోన్ను 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో తీసుకొస్తున్నారు. ఇక మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఇంటర్నల్ స్టోరేజీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చట.
అలాగే ఇందులో పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేను కూడా ఇ్వవనున్నారు. ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇందులో 13 మెగా పిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను కూడా అందిస్తున్నారు. ఈ కెమెరా PDAF టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. 90 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేసే స్క్రీన్ ఈ ఫోన్ సొంతం. కాగా ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కూడా అందించారు. అలాగే ఈ ఫోన్ ను గ్లిట్టరీ వైట్, లైమ్ గ్రీన్, స్టార్ ట్రైల్ బ్లాక్ వంటి కలర్స్ లో తీసుకొస్తున్నారు.