Tata Motors: టాటా మోటార్స్ హైడ్రోజన్ తో నడిచే కారు.. ఫీచర్స్ ఇవే?

ఇండియాలో అతిపెద్ద కంపెనీ అయిన టాటా మోటార్స్ గురించి మనందరికీ తెలిసిందే. టాటా మోటార్స్ కంపెనీ

  • Written By:
  • Publish Date - December 23, 2022 / 07:00 AM IST

ఇండియాలో అతిపెద్ద కంపెనీ అయిన టాటా మోటార్స్ గురించి మనందరికీ తెలిసిందే. టాటా మోటార్స్ కంపెనీ టెక్నాలజీ పై దృష్టిని పెట్టి కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఎన్నో ప్రయత్నాలను చేస్తోంది. ఈ క్రమంలోనే టాటా మోటార్స్ కంపెనీ హైడ్రోజన్ తో నడిచే కార్లను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాగా వచ్చే ఏడాది జరిగే ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ విషయం పై పూర్తి సమాచారాన్ని అందించనుంది. టాటా మోటార్స్ భవిష్యత్తులో హైడ్రోజన్ పవర్డ్ కార్లను కూడా ప్రవేశపెట్టనుంది. కాగా ఇదే విషయాన్ని టాటా కంపెనీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. టెయిల్ పైప్ ఉద్గారాలను తగ్గిస్తూనే కొత్త యుగం వాహనాలను తీసుకురావడానికి టాటా మోటార్స్ కట్టుబడి ఉందని కంపెనీ ట్వీట్ లో పేర్కొంది.

ఆటో ఎక్స్‌పో 2023 లో కంపెనీ పూర్తి వివరాలను తెలియజేస్తుంది. ఆటో ఎక్స్‌పోలో కంపెనీ హైడ్రోజన్‌తో నడిచే కారు ప్రోటోటైప్ మోడల్‌ను ప్రదర్శించవచ్చని భావిస్తున్నారు. కాగా టాటా కంపెనీ కార్లను నిరంతరం మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. టాటా సఫారీ, హారియర్, టిగోర్, టియాగో, ఆల్ట్రోజ్, పంచ్ వంటి కార్లు దీనికి బెస్ట్ ఉదాహరణ. NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో కంపెనీ కార్లు సేఫ్టీ పరంగా అద్భుతంగా పనిచేశాయి. దీంతో పాటు కాలుష్యాన్ని తగ్గించడంపై కూడా కంపెనీ దృష్టి సారిస్తోంది. కంపెనీకి చెందిన నెక్సాన్, టిగోర్ వంటి ఎలక్ట్రిక్ కార్లకు ఇండియాలో డిమాండ్ పెరుగుతుంది.

అంతేకాకుండా, కంపెనీ కొంతకాలం క్రితం టియాగో ఎలక్ట్రిక్‌ను రూ. 10 లక్షల కంటే తక్కువ ధరతో పరిచయం చేసింది. ఈ కారు ప్రవేశపెట్టినప్పటి నుండి పెద్ద సంఖ్యలో బుకింగ్‌లను సొంతం చేసుకుంది. ఎలక్ట్రిక్‌తో పాటు, కంపెనీ CNG పోర్ట్‌ఫోలియోను కూడా విస్తరిస్తోంది. జనవరిలో కంపెనీ టిగోర్ ఇంకా టియాగోలో సిఎన్‌జిని ప్రవేశపెట్టింది.