Galaxy S23: శాంసంగ్ ఫోన్‌పై బంపర్ ఆఫర్.. రూ. 50 వేలలోపే సొంతం చేసుకోండిలా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదా

  • Written By:
  • Updated On - February 13, 2024 / 05:28 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఇప్పటికే మంచి మంచి స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన శాంసంగ్ సంస్థ ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త కొత్త ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సంస్థ శాంసంగ్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరను ప్రకటించింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. సామ్‌సంగ్‌ గత ఏడాది అక్టోబర్‌లో గెలాక్సి ఎస్‌23ఎఫ్‌ఈ పేరుతో ఒక ఫోన్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

లాంచింగ్ సమయంలో ఈ ఫోన్‌ ధర రూ. 64,990గా ఉంది. అయితే తాజాగా ఈ ఫోన్‌పై కంపెనీ భారీ ఢిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఫోన్‌కు సంబంధించి 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌ 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌పై రూ. 5 వేల డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. డిస్కౌంట్ తర్వాత 128 జీబీ వేరియంట్‌ను రూ. 54,990 కాగా 256 జీబీ వేరియంట్‌ను రూ. 64,990కి సొంతం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే డిస్కౌంట్ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనం రూ. 10 వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో 128 జీబీ వేరియంట్‌ను రూ. 50 వేలలోపే సొంతం చేసుకోవచ్చు.

ఇక సామ్‌సంగ్‌ గ్యాలక్జీ ఎస్‌23ఎఫ్‌ఈ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.4 ఇంచెస్‌తో కూడిన డైనమిట్ అమోఎల్‌ఈడీ 2ఎక్స్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెస్‌ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం. అవుట్‌ డోర్‌ విజిబులిటీ కోసం ఇందలో ప్రత్యేకంగా విజన్‌ బూస్టర్ టెక్నాలజీని అందించారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 25 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.