Free Screen Replacement : ఆ ఫోన్లు వాడుతున్నారా ? ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్​మెంట్

Free Screen Replacement : మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా ?  అయితే మీకే ఈ శుభవార్త.

  • Written By:
  • Publish Date - April 23, 2024 / 10:48 AM IST

Free Screen Replacement : మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా ?  అయితే మీకే ఈ శుభవార్త. ఉచితంగా డిస్​ప్లే రీప్లేస్​మెంట్ చేస్తామని శాంసంగ్ కంపెనీ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదండోయ్ !! షరతులు వర్తిస్తాయి !!గ్రీన్​ లైన్ సమస్యను ఎదుర్కొంటున్న గెలాక్సీ ఫోన్​ యూజర్లకు మాత్రమే ఫ్రీగా డిస్​ప్లే రీప్లేస్​మెంట్ చేస్తారు. ​ ఆ మోడల్‌కు చెందిన ఫోన్లను వాడేవారు ఈ ఆఫర్‌ను ఏప్రిల్​ 30 వరకు వాడుకోవచ్చు. ఇది వన్ టైమ్ ఆఫరే అని శాంసంగ్ కంపెనీ స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join

ప్రస్తుతం శాంసంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎస్​20, గెలాక్సీ ఎస్​21, గెల్సాకీ నోట్​ 20, గెలాక్సీ 22   మోడళ్లలో గ్రీన్ లైన్​ సమస్య ఉంది.  వాటిలో ఉచితంగా డిస్​ప్లే‌లను రీప్లేస్ చేస్తారు. గత మూడేళ్లలోగా గెలాక్సీ ఫోన్లు కొన్నవారికి మాత్రమే ఈ ఫ్రీ ఆఫర్​ వర్తిస్తుంది. వాస్తవానికి శాంసంగ్ గెలాక్సీ ​ ఫోన్లలో చాలా సార్లు గ్రీన్ లైన్ ఇష్యూ తలెత్తింది. దీంతో యూజర్లు చాలా అసౌకర్యానికి గురయ్యారు. తాజాగా విడుదల చేసిన గెలాక్సీ ఎస్​21 సిరీస్​ ఫోన్లలోనూ యూజర్లకు అదే ప్రాబ్లమ్ ఎదురైంది. దీంతో శాంసంగ్ కంపెనీకి పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

Also Read : MLC Kavitha : నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. బెయిల్ వస్తుందా ?

తమ యూజర్ల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఫ్రీగా డిస్​ప్లే రీప్లేస్​మెంట్(Free Screen Replacement) చేయాలని శాంసంగ్ కంపెనీ డిసైడ్ అయ్యింది. ఈ ఆఫర్‌ను​ పొందడానికి వారెంటీ అక్కర్లేదు. ఫోన్​ వారెంటీ డేట్ పూర్తయిన వాళ్లు కూడా ఫ్రీగానే స్క్రీన్ రీప్లేస్​మెంట్ చేయించుకోవచ్చు. ఇందుకోసం ఆయా ఫోన్ల యూజర్లు ​ ఏప్రిల్ 30లోగా సమీపంలోని శాంసంగ్ సర్వీస్​ సెంటర్​కు వెళ్లి అపాయింట్​మెంట్ బుక్ చేసుకోవాలి. శాంసంగ్ కంపెనీ ఆయా ఫోన్లకు ఫ్రీగా బ్యాటరీ రీప్లేస్​మెంటు సైతం చేయనుందట.  ఈ ఆఫర్ నేపథ్యంలో ఓ ప్రశ్న ఉదయిస్తోంది. ఇతర ఫోన్ల మోడళ్లలో గ్రీన్​ లైన్ సమస్యను ఎదుర్కొంటున్న వారి కోసం శాంసంగ్ ఏమీ చేయదా ? అని పలువురు యూజర్లు అడుగుతున్నారు.

Also Read :Arvind Kejriwal : ఎట్టకేలకు తిహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్