Realme Pad X: ‘రియల్ మీ’ నుంచి సూపర్ ఫిచర్లతో ట్యాబ్.. మీరు ఓ సారీ చూడండి!

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ కంపెనీల

  • Written By:
  • Publish Date - July 27, 2022 / 07:00 AM IST

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ కంపెనీల స్మార్ట్ వాచ్ లు మార్కెట్లో ఉన్నప్పటికీ సరికొత్తగా రకరకాల ఫ్యూచర్లతో కూడిన స్మార్ట్ వాచ్ లును అందుబాటులోకి తీసుకొని వస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో దాదాపుగా అన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు స్మార్ట్ వాచ్ ల తయారీనీ మొదలుపెట్టాయి. రోజురోజుకీ పెరుగుతున్న పోటీ కారణంగా స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తీసుకొని రావడంతో పాటుగా ఎక్కువ ఫీచర్లతో తక్కువ ధరలో అందుబాటులో ఉండే విధంగా మార్కెట్లోకి తీసుకువస్తున్నారు.

అయితే తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు ఉన్న స్మార్ట్ వాచ్ లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనా కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తాజాగా రియల్ మీ వాచ్ 3 నీ అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా ఇప్పటికే రియల్ మీ సంస్థ భారత్ మార్కెట్లోకి రియల్ మీ వాచ్ 2, రియల్ మీ వాచ్ 2 ప్రో పేర్లతో రెండు రకాల వాచ్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విడుదల చేసిన రియల్ మీ వాచ్ 3 ప్రారంభం ధర రూ.3,499. అయితే ఈ వాచ్ ను ఆరంభంలోనే కొనుగోలు చేసే వారికి ఈ వాచ్ రూ. 2,999 లకే లభిస్తోంది. బడ్స్ ఎయిర్ 3 నియో ధర రూ.1,999. బడ్స్ వైర్ లెస్ 2 ఎస్ ధర.రూ.1,499.

అదేవిధంగా రియల్ మీ ఫ్లాట్ మానిటర్ ను కూడా విడుదల చేసింది. 23.8 అంగుళాలతో ఫుల్ హెచ్ డి ప్యానెల్, 75 గిగా హెర్జ్ రీఫ్రెష్ రేటు తో వస్తోంది. చైనా కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ఆండ్రాయిడ్ మొబైల్స్, స్మార్ట్ వాచ్ ల తో పాటుగా సూపర్ ఫ్యూచర్లతో ట్యాబ్ లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటితో పాటుగా రియల్ మీ భారత మార్కెట్లోకి పలు రకాల నూతన ఉత్పత్తులను కూడా విడుదల చేసింది. రియల్ మీ ప్యాడ్ ఎక్స్ మూడురకాల స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ధర రూ.19,999 కాగా ఇది వైఫై సపోర్ట్ తో పనిచేస్తుంది. అలాగే ఇదే స్టోరేజీ సామర్థ్యంతో 5జీ సపోర్ట్ చేసే ప్యాడ్ ఎక్స్ ధర రూ.25,999. 6జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజీతో కూడిన 5జీ ప్యాడ్ ఎక్స్ మోడల్ ధర రూ.27,999. ఆగస్ట్ 1 నుంచి విక్రయాలు మొదలవుతాయి. ఈ మూడు ట్యాబ్ లపై రూ.2,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చని తెలుస్తోంది.