Digital Rupee: ప్రజల ముందుకు వచ్చేస్తున్న డిజిటల్ రూపాయి.. ఆర్‌బీఐ కీలక ప్రకటన!

Digital Rupee: మాములుగా వెండి ఇనుము, కంచు నాణెములను ఇంతవరకు ప్రజలు చూసారు. ఇపుడు కొత్తగా డిజిటల్ రూపాయి లాంచ్ చేస్తామని ఆర్‌బీఐ ప్రకటించడంతో ఆ డిజిటల్ రూపాయి కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తునారు. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంలోనే ఈ కరెన్సీ గురించి ప్రస్తావించింది.

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 08:45 AM IST

Digital Rupee: మాములుగా వెండి ఇనుము, కంచు నాణెములను ఇంతవరకు ప్రజలు చూసారు. ఇపుడు కొత్తగా డిజిటల్ రూపాయి లాంచ్ చేస్తామని ఆర్‌బీఐ ప్రకటించడంతో ఆ డిజిటల్ రూపాయి కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తునారు. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంలోనే ఈ కరెన్సీ గురించి ప్రస్తావించింది.

కేంద్ర బడ్జెట్‌లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఈ 2022-23 సంవత్సరంలోనే ఆర్‌బీఐ ప్రజల ముందుకు డిజిటల్ కరెన్సీని లాంచ్ చేస్తుందని పేర్కొన్నారు. గత నెలలో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ కూడా ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టులో డిజిటల్ కరెన్సీని లాంచ్ చేస్తుందని చెప్పారు. క్రాస్ బోర్డర్ పేమెంట్లకు ఇది అత్యంత సమర్థవంతమైన విధానంగా పేర్కొన్నారు. బిట్ కాయిన్ లాంటి ప్రైవేట్ వర్చ్యువల్ కరెన్సీలను సీబీడీసీ నిర్మూలిస్తుందని తెలిపారు.

పైలట్ ప్రాజెక్టు లో భాగంగా పరిమిత వాడకానికి పైలట్ బేసిస్‌లో ఈ డిజిటల్ రూపాయిని అందుబాటులో ఉంచుతామని ఆర్‌బీఐ తెలిపింది. ఈ పైలట్ ప్రాజెక్టు లాంచ్ ద్వారా భారత్‌లో డిజిటల్ రూపాయి వాడకాన్ని పరిశీలించనుంది. ఈ సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ జారీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కాన్సెప్ట్ నోటును విడుదల చేస్తున్నట్టు RBI తెలిపింది. అదేవిధంగా డిజిటల్ రూపాయి ప్లాన్డ్ ఫీచర్లను ఇది తెలియజేసింది.

ఈ డిజిటల్ రూపాయి ఉద్దేశం, ప్రయోజనాలు, ప్రమాదాలు వంటి వాటిని వివరించింది. సీబీడీసీ ప్రవేశపెట్టేందుకు రిజర్వు బ్యాంకు అనుసరిస్తున్న విధానాన్ని కూడా ఈ కాన్సెప్ట్ నోటులో ఆర్‌బీఐ వివరించినట్టు తెలిపింది. ఎప్పటికప్పుడు ఈ డిజిటల్ రూపాయి ప్రత్యేక ఫీచర్లను, ప్రయోజనాలను ప్రజలకు ఆర్‌బీఐ తెలియజేస్తూ ఉంటుందని పేర్కొంది.

‘‘ఈ-రూపీ అనేది ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెన్సీలకు అదనపు ఆప్షన్. అయితే బ్యాంకు నోట్ల(Currency Notes)తో పోలిస్తే పెద్దగా ఎలాంటి తేడాలుండవు. ఇది కేవలం డిజిటల్ రూపంలో మాత్రమే ఉంటుంది. కరెన్సీ నోట్లకు ఎంత విలువ అయితే ఉంటుందో అంతే విలువ ఈ-రూపీకి ఉంటుంది. అంతేకాక దీన్ని తేలిగ్గా వాడుకోవచ్చు.ఈ కరెన్సీలో లావాదేవీలను వేగంగా పూర్తి చేసుకోవచ్చు. ఇతర డిజిటల్ మనీకి ఉన్న లావాదేవీల ప్రయోజనాలన్ని కూడా దీనికి ఉంటాయి.’’ అని ఆర్‌బీఐ ప్రకటించింది.

సీబీడీసీని బ్యాంకింగ్ సిస్టమ్‌(Banking System)లోకి ప్రవేశపెట్టిన తర్వాత, మానిటరీ పాలసీలో, ఆర్థిక స్థిరత్వంలో, ప్రైవసీ సమస్యల విషయంలో వచ్చే అన్ని ఇబ్బందులను తాము పరిశీలించనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ సీబీడీసీ(CBDC)ని సెంట్రల్ బ్యాంకు డిజిటల్ రూపంలో జారీ చేసే చట్టపరమైన కరెన్సీగా పేర్కొంటోంది. దీన్ని పేమెంట్ల వారధిగా వాడుకోవచ్చు. సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు.

బిట్ కాయిన్(Bitcoin) లాంటి క్రిప్టో కరెన్సీలను ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.క్రిప్టో కరెన్సీల వల్ల తీవ్ర ప్రమాదాలున్నాయని హెచ్చరిస్తున్నాయి. వర్చ్యువల్ ఆస్తుల బదిలీపై సంపాదించే లాభాలపై 30 శాతం పన్నులను కూడా ఈ బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పన్నుల విధానాన్ని కూడా అమల్లోకి తెచ్చారు. క్రిప్టో కరెన్సీ(Cryptocurrency)లను రెగ్యులేట్ చేయాలా… లేదా బ్యాన్ చేయాలా.. అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా తన స్పష్టతను తెలియజేయాల్సి ఉంది.