చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. వినియోగదారుల అభిరుచుల మేరకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. అంతేకాకుండా అతి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా పోకో సంస్థ భారత మార్కెట్ లోకి కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. పోకో ఎమ్6 ప్రో పేరుతో తీసుకురానున్న ఈ స్మార్ట్ ఫోన్ను ఆగస్టు 5న లాంచ్ కానుంది.
ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ ధర రూ. 14,999 గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ ధర రూ. 15,999 గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర కలిగిన ఫోన్ ధర రూ. 16,999గా ఉంది. పోకో ఎమ్6 ప్రో స్మార్ట్ ఫోన్లో 6.79 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ పంచ్ హోల్ డిస్ప్లేను అందించారు. స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్ఓసీ ప్రాసెసర్ను అందించారు. ఇకపోతే కెమెరా విషయానికొస్తే..
ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. పోకో ఎమ్6 ప్రో స్మార్ట్ ఫోన్లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడిన 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండనుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.