చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. వీటితోపాటు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు కూడా మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు వినియోగదారుల కోసం మరోసారి కొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకు రాబోతోంది. మరి ఆ వివరాలు కి వెళితే.. పోకో సంస్థ ఇప్పుడు మరో కొత్త ఫోన్ ని తీసుకువచ్చింది. గత ఆగస్టులో ఆవిష్కరించిన రెడ్మీ 14 సీ ఫోన్ను రీబ్రాండ్ చేసి పోకో సీ75 ఫోన్ను తీసుకొచ్చింది. రూ. 10 వేల బడ్జెట్లో ఈ ఫోన్ను తీసుకొస్తున్నారు.
కాగా పోకో సీ75 టీచర్ల విషయానికొస్తే.. ఇందులో మీడియాటెక్ హీలియో జీ8 అల్ట్రా చిప్సెట్ ప్రాసెసర్ ను అందించారు. ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగా పిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ స్కిన్ వెర్షన్పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ఫోన్లో 18 వాట్స్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5160 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9170కాగా, 8 జీబీ ర్యామ్,256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ 10,900గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
అలాగే ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 13 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. అంబియెంట్ లైట్ సెన్సర్, యాక్సెలరో మీటర్, ఈ కంపాస్, వర్చువల్ ప్రాగ్జిమిటీ సెన్సర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ సొంతం అని చెప్పవచ్చు.
