Ram Mandir: అయోధ్య భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన పేటీఎం.. టికెట్ కొనుగోలుపై క్యాష్ బ్యాక్?

దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా అయోధ్యకు చేరుకొని బాలరాముడిని దర్శించుకుంటున్నారు. నిత్యం లక్షలాదిమం

  • Written By:
  • Publish Date - February 1, 2024 / 06:00 PM IST

దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా అయోధ్యకు చేరుకొని బాలరాముడిని దర్శించుకుంటున్నారు. నిత్యం లక్షలాదిమంది బాలరాముడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం అయోధ్యలో ఇసుక పోస్తే నేల రాలనంత జనం ఉన్నారు.ఈ చారిత్రాత్మకమైనటువంటి మందిరాన్ని దర్శించడానికి ఇప్పుడు ఎందరో ప్లానింగ్ చేస్తున్నారు. వచ్చేది సమ్మర్ సీజన్ అంటే పిల్లలకు సెలవల కాలం ఇక ట్రిప్సు టూర్స్ కామనే కదా. ఇదివరకటి రోజుల్లో కొంచెం ఫ్రీ దొరికితే చాలు వివిధ ప్రదేశాలకు వెళ్లేవారు.

ప్రస్తుతం మాత్రం ప్రతి ఒక్కరూ హాలిడేస్ అంటే చాలు వెంటనే అయోధ్యకు ట్రిప్పు వేస్తున్నారు. అయితే ఇలా అయోధ్యకు వెళ్లే వారి కోసం పేటీఎం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. పేటీఎం సంస్థ సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీని ప్రజల ముందుకు తీసుకువచ్చింది. పేటీఎం అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా అయోధ్యకు వెళ్లడానికి చేసుకునే బస్, ఫ్లైట్ బుకింగ్ స్పై 100% క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఫ్లైట్స్ తో పాటు బస్సులకి కూడా ఈ ఆఫర్ ఉండడం చాలామంది ప్రయాణికులకు అనుకూలించే విషయం. అయోధ్యకు పేటీఎం ద్వారా బస్సు బుకింగ్ చేసుకుని ఆఫర్ అందుకోవాలి అనుకునే వారు బస్ అయోధ్య అనే ప్రోమో కోడ్ ని ఉపయోగించాలి.

అలాగే మీరు అయోధ్యకి ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నట్లయితే.. ఫ్లైట్ అయోధ్య అనే ప్రోమో కోడ్ ని వాడాల్సి ఉంటుంది. ఈ ప్రోమో కోడ్ వాడి మీరు బుకింగ్ చేసుకున్నట్లయితే బస్సు ప్రయాణికులకు సుమారు 1000 రూపాయలు విమానం టికెట్లు కొన్నవారికి సుమారు 5000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పేటీఎం సంస్థ ఈ టికెట్లపై ఫ్రీ క్యాన్సిలేషన్ ని కూడా వర్తింప చేస్తుంది. బుకింగ్ చేసుకొని తీరా వెళ్లడానికి కుదరక క్యాన్సిల్ చేసుకోవాలి అంటే ఎక్కడ చార్జెస్ పడతాయో అని ఆలోచించేవారికి ఆ ఇబ్బంది కూడా లేకుండా చేసింది. అనివార్య కారణాల వల్ల మీరు ప్లాన్ చేసుకున్న ట్రిప్ కు వెళ్లలేక టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు 100% చార్జీలు రిఫండ్ అవుతాయి. అలాగే బస్సుకి లైవ్ ట్రాకింగ్ సర్వీస్ ని అందించడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని చేకూరుస్తోంది. ఈ ఆఫర్ పై చాలా మంది తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా అయోధ్యకు వెళ్లే పని అయితే ఖచ్చితంగా పేటీఎం ద్వారా బుక్ చేసుకుని క్యాష్ బ్యాక్ పొందండి.