చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పటో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. తాజాగా రక్షాబంధన్ సందర్భంగా సోమవారం మార్కెట్లోకి ఈ ఫోన్ ను విడుదల చేసింది. ఒప్పో ఏ3 5జీ పేరుతో ఈ ఫోన్ ను తీసుకొచ్చారు. తక్కువ దొరికే అద్భుతమైన ఫీచర్లను అందించనుంది ఈ స్మార్ట్ ఫోన్. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకీ వెళితే.. ఒప్పో ఏ3 5జీ స్మార్ట్ ఫోన్లో 6.67 ఇంచెస్తో కూడిన హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్ ను అందించారు. 1604 × 720 పిక్సెల్ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ స్క్రీన్ సొంతం.
దీంతో సన్ లైట్ లో కూడా ఫోన్ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుందట. కాగా ఈ ఒప్పో ఏ3 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ లో 45 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5100 ఎమ్ఏహెచ్ బ్యాటరీని సైతం అందించారు. ఒప్పో ఏ3 ఫోన్లో ప్రత్యేకంగా మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ ఫీచర్ ను అందించారు. దీంతో ఈ ఫోన్ ఛార్జింగ్ చేసిన సమయంలో ఎలాంటి షాక్ రాదు. అలాగే డ్రాడ్ రెసిస్టెంట్ ఫీచర్ తో తక్కువ ఎత్తులో నుంచి కింద పడినా కూడా ఈ ఫోన్ కీ ఏం కాదు.
ఇకపోతే ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఓషన్ బ్లూ, నెబ్యులా రెడ్ వంటి కలర్స్లో లభించనుంది. అయితే తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ను పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తోంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. డ్యూయల్-సిమ్, 5జీ, వైఫై, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు.