చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఒప్పో ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేసింది. వినియోగదారులందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలు కలిగిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది ఒప్పో సంస్థ. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఒప్పో ఏ3ఎక్స్ పేరుతో 4జీ ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.
తక్కువ బడ్జట్ లో అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్ ను తీసుకొచ్చారు. కాగా ఒప్పో ఏ3ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ క్వాల్ కామ్ అక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 1 ప్రాసెసర్ తో పని చేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్ లో 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని కూడా అందించారు. ఇకపోతే కెమెరా పరంగా చూస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ లో 8 మెగా పిక్సెల్స్ కు సపోర్ట్ చేసే రెయిర్ కెమెరాను కూడా అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు.
ఇక ఈ ఫోన్ లో 6.67 ఇంచెస్ తో కూడిన ఎల్సీడీ స్క్రీన్ ను అందించారు. ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,999, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999గా నిర్ణయించారు. మైక్రో ఎస్డీ కార్డు సహాయంతో ఫోన్ స్టోరేజీ కెపాసిటీ పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ కనెక్టివిటీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ వంటి ఫీచర్లను అందించారు. సెక్యూరిటీ కోసం బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా అందించారు.