చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్ప్లస్ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది వన్ ప్లస్ సంస్థ. ఇది ఇలా ఉంటే వన్ప్లస్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ లో ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ని ఈ మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు.
అయితే మొదట చైనాలో ఈ ఫోన్ ను లాంచ్ చేయనున్నారు. ఆ తర్వాత భారత్ లో లాంచ్ కానుంది. అయితే ఈ ఫోన్ కు సంబంధించిన కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఇక వన్ప్లస్ 13 ఫోన్లో 6.8 ఇంచెస్తో కూడి స్క్రీన్ను ఇవ్వనున్నారు. 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో ఈ స్క్రీన్ను తీసుకొస్తున్నారు. ఇక ఈ ఫోన్లో 6000 ఎమ్ఏహెచ్తో కూడిన అత్యంత శక్తివంతమైన బ్యాటరీని అందించనున్నారు.
అలాగే ఈ ఫోన్ను 100 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేలా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. స్క్వేర్ కెమెరా సెటప్తో ఇందులో కెమెరాను ఇవ్వనున్నారు. 50 ఎంపీతో కూడిన కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే 6 ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఈ కెమెరా సొంతం. ఈ ఫోన్లో ఐపీ68 రేటింగ్తో కూడిన వాటర్ రెసిస్టెంట్ను ఇవ్వనున్నారు. సెక్యూరిటీ కోసం అల్ట్రా సోనిక్ సెన్సర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ను ఇవ్వనున్నారు. ఇందులో 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ను అందించనున్నట్లు తెలుస్తోంది.