ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ మోటోరోలా ఇండియన్ మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. అంతే కాకుండా వినియోగదారులందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ ని కూడా అందిస్తోంది. ఇది ఇలా ఉండే మోటోరోలా సంస్థ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది.
కాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. మోటోరోలా ఎడ్జ్ 50 నియో పేరుతో ఈ ఫోన్ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ తొలి సేల్ ను సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానుందని కంపెనీ అధికారికంగా తెలిపింది. కంపెనీ అధికారిక వెబ్సైట్ తో పాటు, ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.4 ఇంచెస్ తో కూడిన సూపర్ హెచ్డీ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. 120 Hz రిఫ్రెష్ రేట్, 2800 నిట్ ల గరిష్ట బ్రైట్ నెస్ ఈ స్క్రీన్ సొంతం అని చెప్పవచ్చు. దీంతో ఈ ఫోన్ స్క్రీన్ సన్లైట్ లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ ఫోన్లో ఐపీ68 రేటింగ్ తో కూడిన వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ను అందించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది.
ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ను కూడా అందించారు. ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ లో 50 మెగా పిక్సెల్స్ తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే 13 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా సెటప్ ను కూడా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఇకపోతే మోటోరోలా ఎడ్జ్ 50 నియో బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ లో 68 వాట్స్ టర్బో ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 4310 ఎమ్ఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించారు. ఇక ధర విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999గా నిర్ణయించారు.