ఖరీదైన ఫోన్ అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది ఐఫోన్. ఈ ఐఫోన్ల ధర లక్షల్లో ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇవి కాకుండా మిగతా కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు కొన్ని లక్ష లేదా లక్షకు లోపే ఉన్నాయి. అయితే ఐఫోన్ల కంటే ఖరీదైన ఫోన్లు ఉన్నాయని మీకు తెలుసా? మరి ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హువాయి మేట్ 30 ఆర్ఎస్ పోర్చే డిజైన్ స్మార్ట్ ఫోన్ ధర అక్షరాలా రూ. 2,14,990 గా ఉంది. ఈ ఫోన్ ఇంకా లాంచ్ కాలేదు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 2.86 GHz ప్రాసెసర్ తో కూడిన కిరిన్ 990 ఆక్టా కోర్ చిప్సెట్ ప్రాసెసర్ ను ఇచ్చారు. ఇందులో 6.53 ఇంచెస్ తో కూడిన స్క్రీన్ ను ఇచ్చారు.
మరో ఖరీదైన ఫోన్ హువాయ్ మేట్ ఎక్స్2 స్మార్ట్ ఫోన్ ధర రూ. 2,04,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ 8 ఇంచెస్ తో కూడిన స్క్రీన్ ను అందించారు. ఇక ఇందులో 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.
కాగా ఖరీదైన ఫోన్ల జాబితాలో ఉన్న మరో ఫోన్ లో లంభోర్గిని 88 తారి. ఈ ఫోన్ ధర అక్షరాలా రూ.3,60,000 గా ఉంది. ఇందులో 5 ఇంచెస్ తో కూడిన స్క్రీన్ ను అందించారు. ఈ ఫోన్ క్వాడ్ కోర్ 2.3 GHz చిప్సెట్ ప్రాసెసర్ ను అందించారు.
శాంసంగ్ గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ 6 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ధర రూ. 1,99,990 గా నిర్ణయించారు. ఈ ఫోన్ ను 12జీబీ రామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 8.2 ఇంచెస్ తో కూడిన స్క్రీన్ను అందించారు. 200ఎంపీ క్వాడ్ కెమెరా ఈ ఫోన్ సొంతం.
షావోమీ అంటే బడ్జెట్ ఫోన్ లకు పెట్టింది పేరు. అయితే ఈ కంపెనీకి చెందిన షావోమీ నుంచి ఒక ప్రీమియం ఫోన్ వస్తోంది. షావోమీ నుంచి రెడ్మీ కే 20 ప్రో సిగ్నేచర్ ఎడిషన్ ఫోన్ను తీసుకొస్తోంది. బంగారం, డైమండ్స్తో రూపొందించిన ఈ ఫోన్ ధర అక్షరాల రూ. 4,80,000 గా ఉంది. ఇందులో 6.39 ఇంచెస్ స్క్రీన్ ను అందిస్తున్నారు. 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.