Lenova: భారత్ మార్కెట్‌లోకి కొత్త లెనోవో ట్యాబ్.. ధర, ఫీచర్‌లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

లెనోవో సంస్థ ఇప్పటికే పలు రకాల ట్యాబ్ లను భారత మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులకు నచ్చే విధంగా పలు ట్యాబ్ లను మార్కెట్లోకి విడుదల చేసింది.

  • Written By:
  • Publish Date - October 2, 2022 / 10:10 AM IST

లెనోవో సంస్థ ఇప్పటికే పలు రకాల ట్యాబ్ లను భారత మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులకు నచ్చే విధంగా పలు ట్యాబ్ లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్ ను లాంచ్ చేసింది లెనోవో సంస్థ. లెనోవో ట్యాబ్‌ ఎమ్‌10 ప్లస్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు. కాగా ఈ ట్యాబ్ డిస్ ప్లే 10.61 ఇంచెసలు.

అలాగే భారీ 2కే డిస్‌ ప్లే తో ఈ ట్యాబ్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పనిచేసే ఈ ట్యాబ్‌ పని చేస్తుంది. ఇక ట్యాబ్ కీ వైఫై, సిమ్‌కి సపోర్ట్‌ చేసే వెర్షన్స్‌లో ఇచ్చారు. అలాగే ఈ ట్యాబ్ లో స్నాప్‌ డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌తో పనిచేసి పిల్లల కోసం ప్రత్యేకమైన కంటెంట్ ఫిల్టర్స్, సెఫ్టీ కంట్రోల్స్, ప్రైవసీ సపోర్ట్ ఉండే విధంగా గూగుల్ కిడ్స్ స్పేస్‌ను అందించింది. ఇకపోతే ఈ ట్యాబ్ కెమెరా విషయానికొస్తే..

ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం కూడా 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించడం జరిగింది. అలాగే ఈ ట్యాబ్ కీ డాల్బీ అట్మోస్‌ టెక్నాలజీకి సపోర్ట్ చేసే నాలుగు స్పీకర్లను కూడా ఇచ్చారు. కాగా ఈ ట్యాబ్ ధర విషయానికొస్తే..ఈ ట్యాబ్‌ వైఫై ఓన్లీ మోడల్ ధర రూ.19,999 కాగా వైపై ప్లస్ LTE వేరియంట్ రూ.21,999 ధరకు అందుబాటులో లభించనుంది.