భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయినా లావా ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్ ఫోన్లను భారత మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఒక అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది. 50 మెగాపిక్సల్ ఏఐ ట్రిపుల్ కెమెరా,6 ఎక్స్ జూమ్ పెరిస్కోప్ స్టైల్ తో లావా బ్లేజ్ ప్రో అనే ఒక కొత్త బడ్జెట్ ఫోన్ ను నేడు అనగా మంగళవారం రోజు విడుదల చేసింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదల అయిన లావా బ్లేజ్ కు ఈ స్మార్ట్ ఫోన్ సక్సెసర్.
ఈ స్మార్ట్ ఫోన్ కి సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బాటమ్ ఫైరింగ్ స్పీకర్,ప్రీమియం ప్రోస్టేడ్గ్లాస్ డిజైన్, ఫేస్ అన్లాక్ సపోర్ట్, అదేవిధంగా టైప్ సీ చార్జర్ లాంటి ఇతర ఫీచర్ లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి. ఇకపోతే లావా బ్లేజ్ ప్రొ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.5 అంగుళాల హెచ్ డి డిస్ప్లే,ఆండ్రాయిడ్ 12, MediaTek జీ 37 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4 జీబీర్యామ్, 64 జీబీ స్టోరేజ్,8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో 5000mAh బ్యాటరీ కెపాసిటీ కలదు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే లావా బ్లేజ్ ప్రో ధర రూ. 10,499 గా ఉంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ గ్లాస్ గ్రీన్, గ్లాస్ ఆరెంజ్,గ్లాస్ బ్లూ, గ్లాస్ గోల్డ్ అనే నాలుగు విభిన్న రంగులలో లభించనుంది. అదేవిధంగా ఫ్లిప్ కార్ట్,లావా, ఇ స్టోర్ దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్ లలో అందుబాటులో ఉంటుంది అని కంపెనీ వెల్లడించింది.