అత్యంత వేగంగా ఛార్జింగ్ పూర్తయ్యే సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఇన్ ఫినిక్స్ (In Phoenix) కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. జీరో అల్ట్రా (Zero Ultra) పేరుతో తెస్తున్న ఈ 5 జీ ఫోన్ కేవలం 12 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ నెల 25 నుంచి ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు ప్రారంభించనున్నట్లు ఇన్ ఫినిక్స్ (In Phoenix) కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.29,999 గా కంపెనీ ప్రకటించింది.
☛ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్,
☛ 6.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోల్డ్ డిస్ ప్లే,
☛ ఫింగర్ ప్రింట్ లాక్,
☛ 200 ఎంపీ ప్రైమరీ కెమెరా,
☛ 13 ఎంపీ అల్ట్రా వైడ్,
☛ మరో 2 ఎంపీ డెప్త్ కెమెరా,
☛ ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ,
☛ బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్
☛ 180 వాట్ల సామర్థ్యంతో మన దేశంలో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఫోన్లలో సూపర్ ఫాస్ట్ గా ఛార్జయ్యే ఫోన్ గా జీరో అల్ట్రా (Zero Ultra) నిలిచిపోతుంది.
Also Read: Hero XPulse 200T 4V: అదిరిపోయే లుక్స్తో హీరో మోటోకార్ప్ నుంచి న్యూ బైక్