యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) అనేది నేటి డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలకు ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. అయితే దీనితో పాటు సైబర్ నేరగాళ్ల నుండి మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు యూపీఐ వినియోగదారులు తప్పనిసరిగా పాటించాల్సిన ఆరు ముఖ్యమైన జాగ్రత్తలను వివరించారు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా సైబర్ మోసాల బారిన పడకుండా ఉండవచ్చు.
పాటించాల్సిన 6 జాగ్రత్తలు:
యూపీఐ ఐడీని సరిచూసుకోవాలి: డబ్బు పంపే ముందు, మీరు పంపుతున్న వ్యక్తి యొక్క యూపీఐ ఐడీని ఒకటి లేదా రెండుసార్లు సరిగ్గా చూసుకోండి. పొరపాటున వేరే ఐడీకి డబ్బు పంపితే, దానిని తిరిగి పొందడం చాలా కష్టం.
యూపీఐ పిన్ ఎవరికీ చెప్పకూడదు: మీ యూపీఐ పిన్ను ఎవరైనా బ్యాంక్ ఉద్యోగి అని చెప్పి అడిగినా సరే ఎవరికీ చెప్పవద్దు. మీ పిన్ను తరచూ మార్చడం ద్వారా మీ ఖాతా భద్రతను పెంచుకోండి.
అపరిచితుల క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయవద్దు: మీకు తెలియన వ్యక్తులు వాట్సప్లో పంపిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయవద్దు. ఇది మీ ఖాతా నుండి డబ్బును తస్కరించడానికి ఒక మార్గం కావచ్చు.
Rahul Gandhi : భారత్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు.. మోడీ మౌనం అందుకేనా?: రాహుల్ గాంధీ ఎద్దేవా
బ్యాంక్ స్టేట్మెంట్లను తరచూ తనిఖీ చేయాలి: మీ బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్లను తరచూ తనిఖీ చేయడం ద్వారా మీ ప్రమేయం లేకుండా జరిగిన లావాదేవీలను వెంటనే గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవచ్చు.
యూపీఐ యాప్లను అప్డేట్ చేయాలి: మీ యూపీఐ యాప్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. కొత్త అప్డేట్లు మెరుగైన భద్రతా ఫీచర్లను అందిస్తాయి, పాత వెర్షన్లలో ఉన్న భద్రతా లోపాలను సరిచేస్తాయి.
మోసానికి గురైన వెంటనే 1930కి కాల్ చేయండి: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురై, డబ్బులు కోల్పోతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. త్వరగా ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ యూపీఐ లావాదేవీలను సురక్షితంగా చేసుకోవచ్చు. సైబర్ నేరాల నుండి రక్షణ పొందడానికి అప్రమత్తంగా ఉండటం అత్యంత ముఖ్యం.