World Cup 2023: 2013లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత టీమ్ ఇండియా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఈసారి వరల్డ్ కప్ 2023లో మరోసారి టీమ్ ఇండియా ప్రపంచ ఛాంపియన్గా నిలవాలని భావిస్తుంది. అయితే ఈ టోర్నీకి ముందు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చాడు.
ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీ భారత్లో జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియాపై భారత అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా టోర్నీకి ముందు భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ప్రపంచకప్ గురించి ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చాడు. 2023లో స్వదేశంలో జరిగే ప్రపంచకప్ను భారత్ గెలుస్తుందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదని యువరాజ్ సింగ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్ భారత జట్టు బలహీనతలపై స్పందించాడు.
టీమిండియా జట్టు టాప్ ఆర్డర్ బాగానే ఉంది, అయితే మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. 4 మరియు 5 స్థానాలు జట్టుకు చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్నాడు. ఐపీఎల్లో రిషబ్ పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తుంటే, జాతీయ జట్టులో కూడా అతను నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేయాలి. నాల్గవ నంబర్ బ్యాట్స్మెన్ వేగంగా పరుగులు చేయకపోయినా ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు యూవీ. 4 లేదా 5 స్థానాల్లో కేఎల్ రాహుల్ దిగితే బాగుంటుందని అన్నాడు. రింకూ సింగ్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని యువరాజ్ అన్నాడు.
Read More Nirmal BRS: బీజేపీకి షాక్… కమలం వీడి కారెక్కిన నిర్మల్ బీజేపీ నేతలు