సెర్బియాలో జరిగిన వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2022లో భారత రెజ్లింగ్ ఐకాన్ బజరంగ్ పునియా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ప్యూర్టో రికన్ రెజ్లర్ సెబాస్టియన్ రివెరాపై పునియా మెరుగ్గా నిలిచాడు. కాంస్య పతక పోరులో 11-9తో విజయం సాధించి పునియా అగ్రస్థానంలో నిలిచాడు. మొదట్లో వెనకంజలో ఉన్నప్పటికీ రెపెచేజ్ రౌండ్లో పోరాడి పునియా కాంస్య పతక పోరుకు చేరుకున్నాడు. అర్మేనియన్ గ్రాప్లర్ వాజ్జెన్ టెవాన్యన్తో జరిగిన రెపెచేజ్ బౌట్లో విజేతగా నిలవడానికి పునియా కష్టపడ్డాడు. 7-6తో భారత దిగ్గజం విజయం సాధించడంతో మ్యాచ్ వినోదాత్మకంగా సాగింది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో నాలుగు పతకాలు సాధించిన ఏకైక భారతీయుడిగా బజరంగ్ పునియా నిలిచాడు. ప్రపంచ స్థాయిలో బజరంగ్కు ఇది మూడో కాంస్యం కావడం గమనార్హం.