PM Modi: 2025 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు ఢిల్లీకి చేరుకుంది. టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం ఉదయం టీమ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (PM Modi) సమావేశం కానుంది. గత ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి టీమ్ ఇండియా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 52 ఏళ్ల తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోగలిగింది.
ఫైనల్ మ్యాచ్ నవీ ముంబైలో జరిగింది. భారత జట్టు, కోచ్ అమోల్ మజుందార్ ఢిల్లీకి బయలుదేరడానికి ముంబై విమానాశ్రయం చేరుకున్నప్పుడు.. వారికి వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు విమానాశ్రయం వద్ద గుమిగూడారు.
Also Read: U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవరో తెలుసా?
VIDEO | The victorious Indian women's cricket team led by Harmanpreet Kaur touched down in the national capital on Tuesday evening for its meeting with Prime Minister Narendra Modi on Wednesday.
The team won its first global trophy — the 50-over World Cup — beating South… pic.twitter.com/sQRxXb2BTC
— Press Trust of India (@PTI_News) November 4, 2025
రేపు ప్రధాని మోదీతో అల్పాహారం
భారత మహిళల క్రికెట్ జట్టు బుధవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి అల్పాహారం (బ్రేక్ఫాస్ట్) చేయనున్నట్లు సమాచారం. గత సంవత్సరం 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత పురుషుల జట్టుకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇచ్చారు. అప్పుడు ఆయన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా ఇతర భారత ఆటగాళ్లతో కలిసి నవ్వుతూ గడిపారు.
52 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన మహిళలు
లారా వోల్వార్డ్ట్ కెప్టెన్సీలోని దక్షిణాఫ్రికా జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరుకుంది. సెమీఫైనల్లో నాలుగుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్కు అర్హత సాధించింది. మరోవైపు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమ్ ఇండియా సెమీఫైనల్లో ఏడుసార్లు ఛాంపియన్గా నిలిచిన, గత విజేత అయిన ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక ఫైనల్ మ్యాచ్లో భారత్, దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి 52 ఏళ్లలో మొదటిసారి ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది.
