Site icon HashtagU Telugu

Womens T20 World Cup 2023: నేటి నుండి మహిళల టీ20 వరల్డ్ కప్

Women’s T20 World Cup 2023

Resizeimagesize (1280 X 720) 11zon

మహిళల టీ20 ప్రపంచకప్ (Womens T20 World Cup) నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు ఆతిథ్య దేశం దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకతో పోటీపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు జరగనుంది. ఇక్కడ ఫిబ్రవరి 12న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు తన పోరుని ప్రారంభించనుంది. ఈ ప్రపంచకప్‌లో 17 రోజుల్లో మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 26న జరగనుంది.

ఇక్కడ రెండు గ్రూపులు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో 5-5 జట్లు ఉంచబడ్డాయి. అంటే మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని ఇతర నాలుగు జట్లతో ఒకరిపై ఒకరు మ్యాచ్‌లు ఆడతారు. రెండు గ్రూపుల్లోనూ తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. 2009లో ప్రారంభమైన ఈ టోర్నీకి ఇది 8వ ఎడిషన్. 10 జట్ల ఈ టోర్నీకి దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోంది. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఉన్నాయి. ఇంగ్లండ్‌, భారత్‌, ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ మహిళల జట్టు గ్రూప్‌-బిలో చోటు దక్కించుకున్నాయి.

Also Read: Ind vs Aus: తొలి రోజు మనదే… భారీ ఆధిక్యంపై భారత్ కన్ను

భారత మహిళల జట్టు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు తన పోరుని ప్రారంభించనుంది.ఈ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 12న ఈ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. దీని తర్వాత ఫిబ్రవరి 15న వెస్టిండీస్‌తో, ఫిబ్రవరి 18న ఇంగ్లండ్‌తో, ఫిబ్రవరి 20న ఐర్లాండ్‌తో టీమిండియా పోటీపడనుంది. ఆస్ట్రేలియా మహిళల జట్టు ఇప్పటి వరకు ఈ టోర్నీలో 5 సార్లు విజేతగా నిలిచింది. 2020లో భారత్‌ను ఓడించిన తర్వాతే ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. అంతకు ముందు 2018, 2014, 2012, 2010లో కూడా ఆస్ట్రేలియా టైటిల్‌ను గెలుచుకుంది. 2009లో ఇంగ్లండ్‌, 2016లో వెస్టిండీస్‌ మహిళల టీ20 ఛాంపియన్‌గా నిలిచాయి.