Site icon HashtagU Telugu

PBKS vs DC: ఐపీఎల్ 2025.. ఢిల్లీ- పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతుందా?

PBKS vs DC

PBKS vs DC

PBKS vs DC: భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్ కలత చెందింది. ఈ నేపథ్యంలో బుధవారం (మే 7, 2025) చెన్నై సూపర్ కింగ్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ ఘటన తర్వాత బెంగాల్ పోలీసులు విచారణ ప్రారంభించారు. భద్రతను మరింత బలోపేతం చేశారు. ఈ పరిస్థితుల్లో భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య IPL కొనసాగుతుందా అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్- పంజాబ్ కింగ్స్ (PBKS vs DC) మధ్య ధర్మశాలలో జరగనున్న మ్యాచ్ గురించి కొన్ని వార్త‌లు వైర‌ల‌వుతున్నాయి.

ఢిల్లీ- పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతుందా?

ఢిల్లీ క్యాపిటల్స్- పంజాబ్ కింగ్స్ మధ్య IPL 2025 58వ మ్యాచ్ ఈ రోజు (మే 8, 2025) సాయంత్రం 7:30 గంటలకు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రద్దు అవుతుందని BCCI లేదా IPL నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రెండు జట్లు (ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్) ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్నాయి. కాబట్టి లాజిస్టికల్ సమస్యలు లేవు. అయితే భద్రతా ఆందోళనల కారణంగా మ్యాచ్‌పై అనిశ్చితి ఉన్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ధర్మశాల భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సుమారు 60 కి.మీ. దూరంలో ఉండటం వల్ల ఈ సందేహం నెల‌కొంది.

Also Read: Abdul Rauf Azhar : ఆపరేషన్ సిందూర్.. భారత విమానం హైజాక్ సూత్రధారి అబ్దుల్ రవూఫ్ హతం..!

BCCI భారత ప్రభుత్వం నుంచి ఈ మ్యాచ్ నిర్వహణకు అనుమతి పొందింది. భద్రతా ఏర్పాట్లను బలోపేతం చేసింది. అయినప్పటికీ కొన్ని నివేదికల ప్రకారం.. సాయంత్రం ఫ్లడ్‌లైట్ల వాడకం భద్రతా ప్రమాదాన్ని కలిగించవచ్చని భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. BCCI ప్రభుత్వ సలహాలను ట్రాక్ చేస్తూ.. భద్రతా అంచనాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.

మ్యాచ్‌కు ముందు దేశభక్తి కార్యక్రమం

BCCI.. IPL ద్వారా భారత సైన్యానికి సలాం చేస్తోంది. ఈ రోజు ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ ముందు సాయంత్రం 6:30 గంటలకు గాయకుడు B ప్రాక్ దేశభక్తి గీతాలతో కార్యక్రమం నిర్వహిస్తారు. దీనితో స్టేడియం దేశభక్తి గీతాలతో మార్మోగనుంది. గత రోజు ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై-కోల్‌కతా మ్యాచ్ ముందు జాతీయ గీతం ఆలపించారు. వేలాది మంది ప్రేక్షకులు ‘వందే మాతరం’ గీతాన్ని ఏకకంఠంతో ఆలపించారు.