Site icon HashtagU Telugu

Pitch Report: ఈరోజు జరిగే మ్యాచ్ లో పరుగుల వర్షం కురిసే అవకాశం.. వాంఖడే పిచ్ రిపోర్ట్ ఇదే..!

Pitch Report

Compressjpeg.online 1280x720 Image 11zon

Pitch Report: ICC ప్రపంచకప్ 2023లో భారత జట్టు ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో తలపడనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన టీమ్ ఇండియా ఈ మ్యాచ్ లో కూడా గెలవాలని పట్టుదలతో ఉంది. రోహిత్ సేన వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేస్తే సెమీ ఫైనల్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోనుంది. అదే సమయంలో శ్రీలంక సెమీఫైనల్స్ కు వెళ్ళటం అంత సులువు కాదు. కుశాల్ మెండిస్ నేతృత్వంలోని శ్రీలంక మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

వాంఖడే పిచ్ రిపోర్ట్

ప్రపంచ కప్ 2023లో భారత్- శ్రీలంక (IND vs SL) మధ్య ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. వాంఖడే పిచ్‌ (Pitch Report)ను బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామంగా భావిస్తారు. ముంబైలోని ఈ మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. పిచ్‌లో మంచి బౌన్స్ కారణంగా బంతి బ్యాట్‌కు బాగా తగిలి పరుగులు చేయడం చాలా సులభం అవుతుందని తెలుస్తుంది. ప్రపంచకప్ 2023లో ఇప్పటివరకు ఈ మైదానంలో రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డులో 399 పరుగులు చేయగా, రెండో మ్యాచ్‌లో ఆ జట్టు 382 పరుగులు చేసింది. అంటే ఈ గణాంకాలను పరిశీలిస్తే పిచ్ బ్యాట్స్ మెన్ కు ఎంతగానో సహకరిస్తుందని తెలుస్తుంది.

Also Read: Mitchell Marsh: ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్.. కీలక మ్యాచ్ కు ముందు స్టార్ ఆటగాడు దూరం..!

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

వాంఖడే మైదానంలో ఇప్పటి వరకు వన్డే క్రికెట్‌లో మొత్తం 31 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అదే సమయంలో ఛేజింగ్ జట్టు 15 మ్యాచ్‌ల్లో గెలిచింది. అంటే ఇక్కడ టాస్ ఎలాంటి ప్రత్యేక పాత్ర పోషించదు. అయితే ఈ మ్యాచ్‌లో మంచు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోవాలి.

We’re now on WhatsApp. Click to Join.

టీమ్ ఇండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది

ప్రస్తుతం భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇంగ్లండ్‌పై ఆ జట్టు తిరుగులేని విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది ఫాస్ట్ బౌలర్లే. మహ్మద్ షమీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి తన పేస్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కు కష్టంగా మారింది. స్పిన్‌ విభాగంలో కుల్‌దీప్‌ యాదవ్‌ స్పిన్నింగ్‌ బంతులు కూడా బ్యాట్స్‌మెన్స్ ను ఇబ్బంది పెడుతున్నాయి. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందిస్తున్నాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ కూడా తన బ్యాట్ నుండి చాలా పరుగులు చేస్తున్నాడు. అయితే శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌ల ఫామ్ మాత్రం జట్టుకు ఆందోళన కలిగిస్తుంది.