IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ (IND vs AFG) మధ్య రెండో టీ20కి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత జట్టు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మరోవైపు అఫ్గానిస్థాన్ జట్టు కూడా భారత్పై తొలి విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది. ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో నేడు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సిరీస్లో రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ గడ్డపై టీమిండియా రికార్డు ఎలా ఉందో చూద్దాం.
భారత్ 2 మ్యాచ్ల్లో గెలిచింది
సిరీస్లోని రెండో మ్యాచ్లో భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. భారత దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో పునరాగమనం చేయబోతున్నాడు. కోహ్లీ రాక కారణంగా ఒక ఆటగాడు జట్టు నుండి తొలగించబడటం ఖాయం. ఇండోర్ స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం 3 టీ20 మ్యాచ్లు జరిగాయి. మూడు మ్యాచ్లు భారత్ ఆడగా.. 3 మ్యాచ్ల్లో భారత్ 2 మ్యాచ్లు గెలిచింది. ఈ మైదానంలో 22 డిసెంబర్ 2017న భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో భారత్ 88 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.
Also Read: Cricketer Amir Hussain: రెండు చేతులు లేకపోయినా బ్యాటింగ్ చేస్తూ..
రెండో బ్యాటింగ్ చేయడం కష్టం
2020 జనవరి 7న ఈ మైదానంలో భారత్ రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో భారత జట్టు శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది కాకుండా ఇక్కడ జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ 4 అక్టోబర్ 2022న జరిగింది. ఇందులో భారత జట్టు 49 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మైదానంలో డిఫెండింగ్లో రెండు జట్లు విజయం సాధించడం గమనార్హం. అదే సమయంలో ఛేజింగ్లో ఒకసారి మ్యాచ్ గెలిచింది. దీన్ని బట్టి ఈ మైదానంలో రెండో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమేననిపిస్తోంది.
సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. తొలి టీ20 మ్యాచ్లో భారత స్టార్ ప్లేయర్ శివమ్ దూబే అద్భుత ప్రదర్శన చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో శివమ్ దూబే బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ జట్టుకు అండగా నిలిచాడు. ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
We’re now on WhatsApp. Click to Join.