Kamalini: ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన‌ క‌మ‌లిని ఎవ‌రు?

16 ఏళ్ల కమలిని అండర్ 19 మహిళల టీ-20 ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో మహిళా క్రీడాకారిణిగా కూడా నిలిచింది.

Published By: HashtagU Telugu Desk
Kamalini

Kamalini

Kamalini: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం 2025 బెంగళూరులో జ‌రిగింది. క్రీడాకారిణీల‌కు సంబంధించిన వేలం పాట జ‌రిగింది. WPL 2025 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ 16 ఏళ్ల క్రీడాకారిణి జి కమలిని (Kamalini)పై కాసుల వ‌ర్షం కురిపించింది. MI ఆమె 16 రెట్లు ఎక్కువ డబ్బుతో తమ జట్టులో భాగం చేసుకుంది. వేలంలో ముఖ్యాంశాలుగా నిలిచిన 16 ఏళ్ల జి కమలిని ఎవరో తెలుసుకుందాం.

కమలిని ఎవరు?

జి కమలిని తమిళనాడుకు చెందిన ఆల్ రౌండర్. ఆమె ఇప్పుడు WPL 2025లో ముంబై ఇండియన్స్ తరపున ఆడనుంది. వేలంలో జి కమలిని బేస్ ధర రూ.10 లక్షలు మాత్రమే. కానీ ముంబై ఇండియన్స్ 16 రెట్లు ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం ద్వారా క‌మ‌లినిని తమ జట్టులో భాగస్వామ్యాన్ని చేసింది. రూ. 1.60 కోట్లకు ఎంఐ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన వేలంలో కమలినిని తమ శిబిరంలో భాగం చేసుకునేందుకు గట్టి పోటీ నెలకొంది. అయితే చివరికి ముంబై గెలిచింది.

Also Read: Minister Seethakka: ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు అమ‌లు చేస్తాం: మంత్రి సీత‌క్క‌

క‌మిలిని ప్ర‌ద‌ర్శ‌న

16 ఏళ్ల కమలిని అండర్ 19 మహిళల టీ-20 ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో మహిళా క్రీడాకారిణిగా కూడా నిలిచింది. విశేషమేమిటంటే.. ఈ 16 ఏళ్ల క్రీడాకారిణి తమిళనాడు కూడా టైటిల్ అందించింది. ఈ 16 ఏళ్ల టాలెంటెడ్ ఆల్‌రౌండర్‌కు భారీ సిక్సర్లు కొట్టే కళ ఉంది. అండర్ 19 మహిళల ట్రోఫీలో కమలిని 10 సిక్సర్లు కొట్టింది.

వికెట్ కీపింగ్ తో పాటు బౌలింగ్

కమలిని వికెట్ కీపింగ్‌తో పాటు లెగ్ స్పిన్ బౌలింగ్‌కు కూడా పేరుగాంచింది. ప్రస్తుతం ఆమె చెన్నైలోని సూపర్ కింగ్స్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె భారత మహిళల అండర్-19 జట్టులో కూడా సభ్యురాలు. ఇప్పుడు కమలిని హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకు సిద్ధంగా ఉంది.

  Last Updated: 16 Dec 2024, 12:35 AM IST