Site icon HashtagU Telugu

Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఉత్కంఠ.. జ‌ట్టులోకి వారిద్ద‌రూ?

Pakistan

Pakistan

Pakistan: ఆసియా కప్ 2025 సమీపిస్తున్న తరుణంలో పాకిస్తాన్ క్రికెట్ (Pakistan) జట్టు ఎంపికపై అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు అనేక మార్పులకు లోనవుతోంది. ముఖ్యంగా ప్రస్తుత టీ-20 జట్టులో బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం గమనార్హం. అయితే, ఆసియా కప్ కోసం వీరిద్దరూ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పాకిస్తాన్ జట్టు ప్రకటన ఎప్పుడు?

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) వచ్చే వారంలో ఆసియా కప్ 2025 కోసం తమ జట్టును ప్రకటించవచ్చని సమాచారం. ఆసియా కప్‌కు ముందు పాకిస్తాన్.. అఫ్గానిస్తాన్, యూఏఈలతో ఒక టీ-20 ట్రై-సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు జరగనుంది. ఈ ట్రై-సిరీస్‌లో పాల్గొనే ఆటగాళ్లే ఎక్కువమంది ఆసియా కప్ జట్టులో ఉంటారని అంచనా.

బాబర్, రిజ్వాన్ తిరిగి రాకపై ఆశలు

టీ-20 ఫార్మాట్‌లో బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, అనుభవజ్ఞుడైన ఫఖర్ జమాన్ ఫిట్‌నెస్‌పై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో సిరీస్‌లో గాయపడిన జమాన్, ప్రస్తుతం లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు.

ఆసియా కప్‌కు ముందు పాకిస్తాన్.. అఫ్గానిస్తాన్, యూఏఈలతో ఒక టీ-20 ట్రై-సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు జరగనుంది. ఈ సిరీస్‌లో బాగా ఆడిన ఆటగాళ్లే ఆసియా కప్ జట్టులో ఎక్కువమంది ఉంటారని అంచనా.

Also Read: Muscle Pain : కండరాల నొప్పితో బాధపడేవారికి మెడిసిన్ వాడకుండానే రిలీఫ్ పొందడం ఎలాగో తెలుసా!

ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ షెడ్యూల్

ట్రై-సిరీస్ కోసం పాకిస్తాన్ షెడ్యూల్