Stop Clock Rule : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరో కొత్త రూల్ను తీసుకొచ్చింది. ఓవర్ల మధ్యలో సమయాన్ని వేస్ట్ చేయకుండా చేయడంతో పాటు మ్యాచ్లను త్వరగా ముగించేందుకు “స్టాప్ క్లాక్” రూల్ను తీసుకొస్తామని ప్రకటించింది. వాస్తవానికి గత కొన్ని నెలలుగా ఈ రూల్ను ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ సంవత్సరం జూన్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ నుంచి “స్టాప్ క్లాక్” రూల్ను పూర్తిస్థాయిలో అమల్లోకి తెస్తామని ఐసీసీ అనౌన్స్ చేసింది. వన్డేలు, టీ20 మ్యాచ్లలో ఈ రూల్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రయోగాత్మక అమలులో సత్ఫలితాలు వచ్చినందు వల్లే ఈ రూల్ను అధికారికంగా అమల్లోకి తేవాలని ఐసీసీ డిసైడ్ చేసింది. ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న ఐసీసీ బోర్డు సమావేశాల్లో దీనిపై నిర్ణయాన్ని ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join
Also Read :TG 09 0001 : టీజీ 09 0001 నంబరుకు రూ.9.61 లక్షలు
జూన్ 27న జరిగే టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్, జూన్ 29న జరిగే ఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్డేకు ఐసీసీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులోభాగంగా లీగ్ లేదా సూపర్ 8 దశలో లక్ష్య ఛేదనకు దిగిన జట్టు ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేస్తేనే ఆట పూర్తైనట్లు పరిగణిస్తారు. నాకౌట్ మ్యాచ్లలో రెండో ఇన్నింగ్స్లో కనీసం 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సిఉంటుంది.
ఈ సమావేశంలో టీ20 ప్రపంచకప్ 2026ను భారత్, శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఇందులో 12 జట్లను ఆటోమేటిక్ క్వాలిఫైయర్లుగా పరిగణిస్తారు. వీటిలో 2024 ప్రపంచకప్లో టాప్ 8 జట్లు కాగా, మిగిలిన నాలుగు జట్లు ఐసీసీ ర్యాంకుల ఆధారంగా ఎంపికవుతాయి. మిగిలిన 8 జట్లను ఐసీసీ రీజినల్ క్వాలిఫైయర్ మ్యాచ్ల ద్వారా ఎంపిక చేస్తారు.