VVS Laxman: ఐర్లాండ్‌తో టీ 20 సిరీస్ ఆడనున్న టీమిండియా జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా ఎంపిక…

జూన్ చివరిలో జరిగే ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా VVS లక్ష్మణ్ ఎంపికయ్యాడు.

  • Written By:
  • Publish Date - May 18, 2022 / 10:51 PM IST

జూన్ చివరిలో జరిగే ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా VVS లక్ష్మణ్ ఎంపికయ్యాడు. ఒక టెస్ట్, 5 T20ల సన్నాహాలను పర్యవేక్షించడానికి రాహుల్ ద్రవిడ్ ఇంగ్లాండ్‌లో ఉన్నసమయంలో టీమిండియా ఐర్లాండ్‌లో రెండు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కు వీవీఎస్ ను హెడ్ కోచ్ గా ఎంపిక చేశారు.

టీమిండియా జూన్ 26, 28 తేదీలలో రెండు T20 మ్యాచుల సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో టీమిండియా గత సంవత్సరం కోవిడ్ వల్ల వాయిదా వేసిన టెస్టు మ్యాచు సిరిస్ ను కొనసాగించనుంది. జులై 1 నుంచి 5 వరకు జరిగే టెస్టు తర్వాత, ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

ఐర్లాండ్‌లో జరిగే రెండు మ్యాచ్‌ల కోసం భారత జట్టుకు కోచ్‌గా నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే జూన్ 24-27 వరకు లీసెస్టర్‌ కౌంటీ జట్టుతో నాలుగు రోజుల మ్యాచ్ ఆడేందుకు ఒక జట్టు ఇంగ్లండ్‌లోనే ఉంటుంది. కాబట్టి ఈ రెండు పర్యటనల్లో ఏ ఆటగాళ్లు భాగమవుతారో చూడాలి.

ఇక స్వదేశంలో (జూన్ 9 నుంచి 19 వరకు) జరిగే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కి మరియు వచ్చే వారం ఐర్లాండ్, ఇంగ్లండ్‌ల పర్యటనకు భారత్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. గత ఏడాది ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్‌ లో చివరి ఏకైక టెస్ట్‌ మ్యాచ్ కోవిడ్ కారణంగా నిలిచి పోయింది. దీంతో ఆ సిరీస్ ముగించేందుకు భారత టెస్ట్ జట్టు జూన్ 15 న ఇంగ్లాండ్ కి బయలుదేరే అవకాశం ఉంది.