Virat Kohli: టీ20 రిటైర్మెంట్‌పై విరాట్‌ కోహ్లీ యూ ట‌ర్న్‌.. కార‌ణ‌మిదే?

ఒలింపిక్ పతకం సాధించాలనే కోరికను వ్యక్తం చేస్తూ.. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నుండి తిరిగి రావడం గురించి పెద్ద ప్రకటన ఇచ్చాడు.

Published By: HashtagU Telugu Desk
Virat Kohli

Virat Kohli

Virat Kohli: భారత జట్టు వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) టీ20 ఇంటర్నేషనల్‌లో రిటైర్మెంట్ నుండి యూ టూర్న్ తీసుకోనున్న‌ట్లు ఓ పెద్ద ప్రకటన ఇచ్చాడు. ఒక షరతు నెరవేరితే కేవ‌లం ఒక మ్యాచ్‌కే తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవచ్చని సూచించాడు. నిజానికి ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై విరాట్ కోహ్లీని అడిగినప్పుడు.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చినట్లయితే కేవలం ఒక మ్యాచ్ కోసం రిటైర్మెంట్ నుండి బయటకు వచ్చేలా ఆలోచించవచ్చని చెప్పాడు.

తన పునరాగమనంపై విరాట్ కోహ్లీ ఇలా అన్నాడు

ఒలింపిక్ పతకం సాధించాలనే కోరికను వ్యక్తం చేస్తూ.. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నుండి తిరిగి రావడం గురించి పెద్ద ప్రకటన ఇచ్చాడు. 2028 ఒలింపిక్స్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంటే ఆ ఒక్క మ్యాచ్‌ కోసమే రిటైర్‌మెంట్‌ నుంచి బయటకు వచ్చేలా ఆలోచిస్తాన‌ని చెప్పాడు. ఒక ఈవెంట్‌లో కోహ్లీ మాట్లాడుతూ.. భారత జట్టు 2028 ఒలింపిక్ ఫైనల్‌కు చేరుకుంటే ఆ ఒక్క మ్యాచ్‌కే టీ20 రిటైర్‌మెంట్‌ నుంచి బయటకు రావాలని నేను అనుకుంటున్నాను. ఒలింపిక్ పతకం గెలవడం నిజంగా గొప్ప విషయమ‌ని కోహ్లీ త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పాడు.

Also Read: Pregnant Women: గర్భిణీ స్త్రీలు గంగాన‌దిలో స్నానం చేయవచ్చా లేదా?

భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) శిబిరంలో చేరాడు. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 18వ సీజన్‌లో అతను ఆడనున్నాడు. ఈ సమయంలో వెటరన్ ప్లేయర్ క్రికెట్ ప్రజాదరణ, ఒలింపిక్స్ 2028లో ఈ ఆటను చేర్చడం గురించి మాట్లాడారు. నేడు ప్రపంచంలో ఎన్నో టీ20 టోర్నీలు జరుగుతున్నాయని చెప్పాడు. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్. క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో చోటు దక్కింది.

128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌ను కూడా చేర్చనున్నారు. గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య చివరిసారిగా 1900 సంవత్సరంలో క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇందులో బ్రిటన్ 158 పరుగుల తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు క్రికెట్ మరోసారి ఒలింపిక్స్‌లోకి రాబోతోంది. ఇప్పుడు దీనిపై భారత మాజీ కెప్టెన్ మాట్లాడాడు. ఆర్‌సిబి ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌కు క్రికెట్ తిరిగి రావడం ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుందని పై వ్యాఖ్య‌లు చేశాడు.

  Last Updated: 15 Mar 2025, 07:37 PM IST