Virat Kohli: కోహ్లీ అంటేనే క్రేజ్‌.. విరాట్ మీద అభిమానంతో ఫ్యాన్‌ ఏం చేశాడంటే?

రంజీ ట్రోఫీలో కోహ్లి ఆడటం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అభిమానుల నిరీక్షణ ముగిసింది. ఢిల్లీ తరఫున కోహ్లీ రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Kohli Retirement Post

Kohli Retirement Post

Virat Kohli: రంజీ ట్రోఫీలో భాగంగా నేడు ఢిల్లీ, రైల్వేస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఆడుతున్నాడు. 13 ఏళ్ల తర్వాత కోహ్లి రంజీలోకి వచ్చాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. కోహ్లిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియంకు చేరుకున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో అభిమానులందరికీ ఉచిత ప్రవేశం లభిస్తుంది.

మైదానంలోకి వ‌చ్చి కోహ్లీ పాదాలను పట్టుకున్న ఫ్యాన్

రంజీ ట్రోఫీలో కోహ్లి ఆడటం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అభిమానుల నిరీక్షణ ముగిసింది. ఢిల్లీ తరఫున కోహ్లీ రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అభిమానుల‌కు కోహ్లి పిచ్చి ఎంతగా ఉందంటే తొలిసారిగా రంజీ మ్యాచ్‌లో మైదానం నిండుగా కనిపించింది. మ్యాచ్ సమయంలో విరాట్ అభిమాని మైదానంలో కోహ్లీ వద్దకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆ అభిమాని కోహ్లీ పాదాలపై పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే విరాట్ సైతం అభిమానిని ఏం అన‌కుండా వ‌దిలేయ‌మ‌ని గ్రౌండ్ సిబ్బందికి, అక్క‌డి సెక్యూరిటీకి సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైర‌ల్ అవుతోంది.

Also Read: Tour Tips : ఏపీలోని ఈ హిల్ స్టేషన్ విశ్రాంతి కోసం ఉత్తమమైనది.. విశాఖపట్నం నుండి 111 కిమీ దూరంలోనే..!

కోహ్లీ 4వ నంబర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు

రెడ్ బాల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఇటీవలి ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈ సిరీస్‌లో కోహ్లీ 190 పరుగులు మాత్ర‌మే చేశాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియా ఓటమి పాలైన తర్వాత బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని ఆటగాళ్లందరికీ సూచించింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో కోహ్లీ నంబర్-4లో బ్యాటింగ్ చేయనున్నాడు.

ఢిల్లీ జట్టు

అర్పిత్ రాణా, సనత్ సాంగ్వాన్, విరాట్ కోహ్లి, యశ్ ధుల్, ఆయుష్ బడోని (కెప్టెన్), ప్రణవ్ రాజువంశీ (వికెట్ కీపర్), సుమిత్ మాథుర్, శివమ్ శర్మ, నవదీప్ సైనీ, మణి గ్రేవాల్, సిద్ధాంత్ శర్మ.

  Last Updated: 30 Jan 2025, 01:34 PM IST