Site icon HashtagU Telugu

Virat Kohli Injured: ఫైన‌ల్ పోరుకు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌.. విరాట్ కోహ్లీకి గాయం?

Virat Kohli

Virat Kohli

Virat Kohli Injured: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకోవాలని టీమిండియా కన్నేసింది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ (Virat Kohli Injured) గాయపడ్డాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.

శిక్షణ సమయంలో ఈ ఆటగాడు గాయపడ్డాడు

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం శిక్షణలో గాయపడ్డాడు. మార్చి 9న న్యూజిలాండ్‌తో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు ముందు ఈ గాయం సంభవించింది. పాకిస్థాన్ జియో న్యూస్ ప్రకారం.. బంతి మోకాలి దగ్గర తగలడంతో కోహ్లి చీలమండకు గాయమై ప్రాక్టీస్ ఆపాల్సి వచ్చింది. భారత వైద్య బృందం వెంటనే అతనికి స్ప్రే వేసి బ్యాండేజీ చేసి చికిత్స అందించిన‌ట్లు పేర్కొంది.

Also Read: India vs New Zealand: భారత్- న్యూజిలాండ్ జ‌ట్ల మధ్య జరిగిన టాప్-4 నాకౌట్ మ్యాచ్‌ల ఫ‌లితాలివే!

టీమ్ మేనేజ్‌మెంట్ అప్‌డేట్ ఇచ్చింది

కోహ్లి గాయం తీవ్రంగా లేదని, అతను ఫైనల్ ఆడేందుకు ఫిట్‌గా ఉంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ హామీ ఇచ్చింది. దీని తర్వాత కూడా విరాట్ కోహ్లీ మైదానంలోనే ఉండి ఇతరుల ప్రాక్టీస్‌ను చూశాడు. ఈ టోర్నీలో భారత్‌కు కీలక ఆటగాడిగా నిలిచిన కోహ్లి ఆదివారం దుబాయ్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు.

కోహ్లీ ప్ర‌ద‌ర్శ‌న అద్భుతంగా ఉంది

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో అతను 72.33 సగటు, 83.14 స్ట్రైక్ రేట్‌తో 217 పరుగులు చేశాడు. కోహ్లీ నిరంతరం మంచి ప్రదర్శన చేస్తున్నాడు. పాకిస్తాన్‌పై సెంచరీ, ఆస్ట్రేలియాపై 84 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. భారతదేశం టాప్ స్కోరర్ కాగా నిలిచిన కోహ్లీ.. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాల్గవ బ్యాట‌ర్‌గా ఉన్నాడు. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్ మార్చి 9వ తేదీన అంటే రేపు జ‌రగ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఓడిపోని టీమిండియా ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ అదే జోరు చూపించాల‌ని చూస్తోంది.